News June 7, 2024

SKLM: పడవ బోల్తా పడి మత్స్యకారుడు మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మూగి యర్రయ్య (55) శుక్రవారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎర్రయ్య తన సహచరులతో వేటకు వెళ్లిన కొద్దిసేపటికి పడవ అదుపుతప్పి నడి సముద్రంలో బోల్తా పడింది. మత్స్యకారులు ఈదుకుంటూ బోల్తా పడిన తెప్ప పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోగా ఎర్రయ్యకు గాయాలు కావడంతో నీటిలో మునిగి మృతి చెందాడు.

Similar News

News January 22, 2026

అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలలో నేటి కార్యక్రమాలు.!

image

అరసవెల్లిలో సప్తాహ్ ఉత్సవాల్లో భాగంగా నేడు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అరసవెల్లి ఆలయంలో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన సేవ జరగనుంది. డచ్ బంగ్లా వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెలీ రైడ్, బెలూన్ రైడ్‌లు ఏర్పాటు చేశారు. కేఆర్ స్టేడియంలో సాయంత్రం ఫుడ్ ఎగ్జిబిషన్, కిడ్స్ ప్లే, నృత్యాలు, మిమిక్రీ, గోరటి వెంకన్న కార్యక్రమంల ‘శ్రీనివాస కళ్యాణం’నాటిక జరుగుతుంది.

News January 22, 2026

SKLM: ఈ నెల 23న కబడ్డీ పోటీలు ప్రారంభం

image

రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 23న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించనున్నారు. వివిధ జిల్లాల నుంచి జట్లు ఈ ఆటల్లో తలపడనున్నాయి. శనివారం కబడ్డీ ఫైనల్స్ పాటు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే వెయిట్ లిఫ్టింగ్, కర్రసాము, సంగీడులు, ఉలవబస్తాల పోటీలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు పోటీలు మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాభిమానులు తరలిరావాలని అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

News January 22, 2026

SKLM: ‘లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం’

image

సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని, గర్భస్థ పిండ లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ యాక్ట్ అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కానింగ్ సెంటర్లు కేవలం వైద్య అవసరాలకే పరిమితం చేయాలన్నారు. మితిమీరితే లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. DMHO అనిత ఉన్నారు.