News June 7, 2024

NEET ఫలితాల్లో అవకతవకలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలి: ప్రియాంక

image

NEET ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన ఆరుగురికి 720/720 మార్కులు రావడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తొలుత ప్రశ్నపత్రం లీకైందని, ఇప్పుడు ఫలితాల్లో స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు.

Similar News

News September 12, 2025

OTTలోకి వచ్చేసిన అనుపమ ‘పరదా’

image

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాగ్ మయూర్, గౌతమ్ మేనన్, సంగీత, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఆగస్టు 22న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది.

News September 12, 2025

శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 66,312 మంది దర్శించుకోగా.. 27,728 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. మరోవైపు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీవారిని దర్శించుకున్నారు.

News September 12, 2025

వాకింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా?

image

వాకింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నడిచే సమయంలో కొన్ని తప్పులు చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తక్కువ వేగంతో నడిస్తే క్యాలరీలు బర్న్ కావు. వేగంగా నడిస్తేనే గుండె, కండరాలు బలోపేతం అవుతాయి. ఫోన్ చూస్తూ వాకింగ్ చేయకూడదు. ఇలా చేస్తే వెన్ను, మెడ నొప్పి సమస్య వస్తుంది. సౌకర్యవంతమైన బూట్లు ధరించి నడవాలి. ఖాళీ కడుపుతో లేదా అతిగా తిన్న తర్వాత వాకింగ్ చేయడం మంచిది కాదు’ అని చెబుతున్నారు.