News June 8, 2024

జనాన్ని దూరం చేసిన భ‘జనం’

image

AP: మాజీ CM జగన్ తన సలహాదారుల మాటలు, నివేదికలు, గణాంకాలను నమ్మి మునిగిపోయారన్నది పార్టీ వర్గాల ఆవేదన. ఒక్క సలహాదారు కూడా జగన్‌కు సరైన దారి చూపించలేదన్నది వారి ఆరోపణ. పార్టీకి ఎవరు అవసరమో వారిని దూరం పెట్టి, ఎవరు హానికరమో వారిని దగ్గరకు చేర్చడం వల్లే ఓటమి ఎదురైందని వారు నమ్ముతున్నారు. ఎప్పుడూ జనం మధ్యే ఉండే జగన్‌ను సీఎం అయ్యాక ఆ జనాలకే దూరం చేశారని.. అందుకే ప్రజలు కూడా జగన్‌ను దూరం పెట్టారని టాక్.

Similar News

News September 10, 2025

మరోసారి భారత్, చైనాలపై ట్రంప్ అక్కసు

image

భారత్‌తో మళ్లీ <<17663735>>స్నేహం<<>> కోరుకుంటూనే ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భారత్, చైనాలపై 100% టారిఫ్స్ విధించాలని యూరోపియన్ యూనియన్‌ను కోరినట్లు సమాచారం. US, EU అధికారుల సమావేశంలో రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై చర్చ జరిగింది. ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ INDపై 50%, చైనాపై 30% టారిఫ్స్ విధించారు.

News September 10, 2025

ట్రంప్‌తో మాట్లాడేందుకు నేనూ ఎదురుచూస్తున్నా: PM మోదీ

image

తనతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానన్న <<17663735>>ట్రంప్<<>> వ్యాఖ్యలకు PM మోదీ బదులిచ్చారు. తానూ ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన IND, US మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోయి, సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు ఇరుదేశాలూ కృషి చేస్తున్నాయని, IND-US భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామన్నారు.

News September 10, 2025

గేట్‌కు దరఖాస్తు చేశారా?

image

<>GATE<<>>-2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ వంటి 30 సబ్జెక్టులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. విద్యార్థులు సెప్టెంబర్ 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మంచి స్కోరు సాధిస్తే IIT, NIT, IISC వంటి ఇన్‌స్టిట్యూట్లలో ఎంటెక్/ఎంఈ/పీహెచ్‌డీల్లో చేరవచ్చు.