News June 8, 2024
పదేళ్ల తర్వాత J&Kలో అసెంబ్లీ ఎన్నికలు!
J&Kలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు EC సిద్ధమవుతోంది. కొత్త పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. చివరగా 2014లో J&K అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు BJP-PDP కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగా ముఫ్తీ మహ్మద్ సయ్యద్ CMగా ఎన్నికయ్యారు. 2016లో ఆయన మరణానంతరం కూతురు మెహబూబా ముఫ్తీ CM అయ్యారు. అయితే 2016లో PDPకి BJP మద్దతు ఉపసంహరించుకోవడంతో J&Kలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.
Similar News
News October 6, 2024
90రోజుల్లోనే 30వేల ఉద్యోగాలిచ్చాం: CM రేవంత్
TG: గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్కు అండగా నిలిచి గెలిపించారని ఆయన గుర్తు చేసుకున్నారు. కొత్తగా నియమితులైన ఇంజినీర్లకు హైదరాబాద్లోని శిల్పారామంలో సీఎం నియామకపత్రాలు అందించారు. ఉద్యోగుల కళ్లలో సంతోషం చూడాలనే దసరాకు ముందు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
News October 6, 2024
భారత్ టార్గెట్ 106 రన్స్
మహిళల టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు రాణించారు. దీంతో 20 ఓవర్లకు పాకిస్థాన్ కేవలం 105/8 రన్స్ చేసింది. ఆ జట్టులో అత్యధిక స్కోరర్ నిదా దార్(28) కావడం గమనార్హం. ఇక భారత బౌలర్లలో అరుంధతీరెడ్డి 3, శ్రేయాంకా పాటిల్ 2 వికెట్లు తీయగా రేణుకా సింగ్, దీప్తిశర్మ, ఆశా శోభన ఒక్కో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 106 రన్స్ చేయాలి.
News October 6, 2024
కుమారులు సినిమాల్లోకి వస్తారా? జూ.ఎన్టీఆర్ సమాధానమిదే
తన కుమారులు అభయ్, భార్గవ్లను సినిమాల్లోకి తీసుకొస్తారా? అన్న ప్రశ్నకు జూ.ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తన అభిప్రాయాలు, ఇష్టాలను వారిపై రుద్దడం నచ్చదన్నారు. వాళ్లిద్దరి ఆలోచనా తీరులో ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పారు. ‘మూవీల్లోకి రావాలి.. యాక్టింగ్లోనే రాణించాలని వాళ్లను ఫోర్స్ చేయను. ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను అలా ట్రీట్ చేయలేదు. పిల్లలకు వారి సొంత ఆలోచనలు ఉండాలనుకుంటా’ అని పేర్కొన్నారు.