News June 8, 2024
ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయండి: సీఎం

TG: గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని TG CMO ట్వీట్ చేసింది. ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని తెలిపారని, అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొంది. కాగా ఉదయం 10 గంటలలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని TGPSC సూచించింది. రేపు జరిగే పరీక్ష కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News April 18, 2026
GREAT: 2,00,000 ప్రసవాలు చేసిన డాక్టర్

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 2 లక్షల మందికి ప్రాణం పోసిన ‘అమ్మ’ ఆమె. HYDకి చెందిన 92 ఏళ్ల డాక్టర్ సూరి శ్రీమతి 60 ఏళ్లుగా వైద్యమే శ్వాసగా జీవిస్తున్నారు. అప్పటి పరిమిత వసతుల నుంచి నేటి హైటెక్ వైద్యం వరకు ఆమె ప్రస్థానం అద్భుతం. వయసు భారమైనా నేటికీ సేవలందిస్తూ నిబద్ధతకు నిలువెత్తు రూపంగా నిలుస్తున్నారు. మాతాశిశు మరణాలను తగ్గించడంలో ఆమె చేసిన కృషి అనితరసాధ్యం. నేటి తరం వైద్యులకు నిజమైన రోల్ మోడల్.
News April 18, 2026
ట్రంప్కు పంచ్.. హార్ముజ్పై బాంబు పేల్చిన ఇరాన్

హార్ముజ్ను తెరవడంపై ఇరాన్ మెలిక పెట్టింది. జలసంధిని US దిగ్బంధిస్తే తాము మళ్లీ మూసివేస్తామని ఇరాన్ నేత గాలిబాఫ్ ప్రకటించారు. ప్రయాణించే నౌకలు తమ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. హార్ముజ్ తెరవడమా, మాసివేయడమా అనేది క్షేత్రస్థాయిలో నిర్ణయిస్తామని, SMలో కాదంటూ ట్రంప్పై సెటైర్ వేశారు. అబద్ధాలు చెప్పి ఆయన యుద్ధంలో గెలవలేరని, ఇలా మాట్లాడితే శాంతి చర్చల్లోనూ ఏమీ సాధించలేరని చురకలంటించారు.
News April 18, 2026
ALERT: ఎండలో బయటికెళ్తున్నారా?

ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన తలనొప్పి, 104 డిగ్రీలకు పైగా జ్వరం, వాంతులు, శ్వాస వేగంగా తీసుకోవడం, చర్మం ఎర్రబడి పొడిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయొద్దని చెబుతున్నారు. నివారణకు తరచుగా నీరు, ORS తాగాలని, మధ్యాహ్నం వేళ ప్రయాణాలు తగ్గించి, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. SHARE IT


