News June 8, 2024
అల్లూరిలో అభ్యర్థి ఎవరైనా వైసీపీదే విజయం

అరకు, పాడేరు నియోజకవర్గాలు YCPకి కంచుకోటగా మారాయి. రెండింటిలోనూ YCP ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2014 నుంచి YCP పోటీలో నిలవగా.. 3సార్లు వేర్వేరు అభ్యర్థులే పోటీచేసి గెలిచారు. అరకులో 2014లో కిడారి సర్వేశ్వరరావు, 2019లో చెట్టి ఫాల్గుణ, 2024లో రేగం మత్స్యలింగం గెలిచారు. ఇటు పాడేరులో 2014 గిడ్డి ఈశ్వరి, 2019లో భాగ్యలక్ష్మి, 2024లో విశ్వేశ్వర రాజు గెలిచారు. అరకు MP స్థానంలో కూడా ఇదే ఫార్ములా నడిచింది.
Similar News
News November 7, 2025
ఆనందపురం: అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్ మృతి

ఆనందపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన కడియం కనకరాజు (53) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కార్పెంటర్గా పనిచేస్తున్న అతను ఆనందపురం గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ నిర్మాణానికి వెళ్లగా అక్కడ మృతి చెందాడు. మొదట సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు తర్వాత అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 7, 2025
విశాఖను డ్రగ్స్కు అడ్డగా మార్చారు: పట్టభి రామ్

విశాఖ డ్రగ్స్ కేసులో YCP విద్యార్థి నాయకుడు కొండా రెడ్డి అరెస్టుతో రాజకీయాలు వేడెక్కాయి. TDP నేత పట్టాభి రామ్ గురువారం మాట్లాడుతూ .. ‘YCP యువజన విభాగం డ్రగ్స్ ముఠాగా మారింది. జగన్ హయాంలో విశాఖను డ్రగ్స్కు అడ్డాగా మార్చారు’అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘కొండా రెడ్డి అరెస్టు అక్రమం. ప్రభుత్వం కక్షతో YCP నేతలను టార్గెట్ చేస్తోంది’ అని ఆరోపించారు.
News November 7, 2025
విశాఖ: ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన సీతమ్మధారకు చెందిన కనపర్తి వీరేందర్, గ్రీన్ గార్డెన్కు చెందిన జాగు సత్యనారాయణకు రూ.50వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇప్పటివరకు 90 మందికి రూ.72 లక్షల పరిహారం అందించినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.


