News June 8, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామోజీరావుకు ఘన నివాళులు.
@ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామన్న జగిత్యాల కలెక్టర్.
@ సైదాపూర్ మండలంలో అనుమానాస్పద స్థితిలో దినసరి కూలీ మృతి.
@ గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.
@ తంగళ్ళపల్లి మండలంలో షెడ్డు కూలీ రెండు లేగ దూడలు మృతి.
@ కాటారం మాజీ జెడ్పిటిసి మృతి.
@ పెద్దపల్లిలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
Similar News
News October 3, 2024
KNR: గడ్డి మందు తాగి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సై తోట తిరుపతి వివరాల ప్రకారం.. వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి(27) ఉద్యోగం వచ్చినప్పటికీ పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గత నాలుగేళ్లుగా హుజురాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. మృతుడి తండ్రి సంపత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 3, 2024
సభ్యత్వ నమోదుపై కేంద్ర మంత్రి బండి రివ్యూ సమావేశం
కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డితో కలిసి సమావేశమై చర్చించారు. అధిక బీజేపీ సభ్యత్వ నమోదులపై దృష్టి సారించాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
News October 3, 2024
గాంధీ జయంతి సందర్భంగా వికలాంగులకు స్కూటీల పంపిణీ
మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా హుస్నాబాద్లో వికలాంగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్కూటీలు పంపిణీ చేశారు. ముందుగా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వికలాంగులై ఉండి రానివారికి మరొక విడుతలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, మునిసిపల్ చైర్మన్ ఆకుల లలిత, వైస్ చైర్మన్ అనిత పాల్గొన్నారు.