News June 9, 2024
చేగుంటలో రోడ్డు ప్రమాదం.. కామారెడ్డి జిల్లా వాసి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1717867299812-normal-WIFI.webp)
మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి NH44 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో KMR జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లికి చెందిన పిట్ల కుమారస్వామి (32) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దశివునూరు నుంచి తన అక్క బావతో కలిసి ద్విచక్ర వాహనంపై రామాయంపేట వైపు వస్తున్న క్రమంలో వెనక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కుమారస్వామి చనిపోగా.. తన అక్క, బావలకు తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News February 11, 2025
బాల్కొండ: పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739263374597_50486028-normal-WIFI.webp)
బాల్కొండలోని బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కిచెన్, డైనింగ్ హాల్లను కలెక్టర్ పరిశీలించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్ను పరిశీలించారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు.
News February 11, 2025
నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739254490210_1043-normal-WIFI.webp)
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
News February 11, 2025
జక్రాన్పల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739242161353_1043-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లా 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జక్రాన్పల్లి మండలం పడకల్ వద్ద ట్రాక్టర్ను కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాజేశ్వర్, ఓడ్డేన్న మృతి చెందగా.. విజయ్ గౌడ్, మహేశ్ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.