News June 9, 2024

NLG: పెట్టుబడి సాయం అందక రైతన్న పాట్లు

image

వానాకాలం సీజన్ ఆరంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాలు కురుస్తుండడంతో పత్తి విత్తనాలు విత్తుతున్నారు. మృగశిర కార్తె ప్రారంభం కావడంతో వరినార్లు పోసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కనీసం విధివిధానాలను రూపొందించకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. పెట్టుబడి సాయం కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News January 24, 2026

NLG: ఎన్నికలకు యంత్రాంగం సర్వం సిద్ధం!

image

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వంసిద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఆ దిశగా అధికారుల సమాయత్తం అవుతున్నారు. జిల్లాలోని NLG కార్పొరేషన్, MLG, HLY, నందికొండ, DVK, CDR, CTL మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి మార్గదర్శకాల పుస్తకాలను మున్సిపల్ సిబ్బంది హైదరాబాద్ నుంచి తీసుకువచ్చారు.

News January 24, 2026

ఏటేటా పడిపోతున్న కూరగాయల సాగు

image

జిల్లాలో కూరగాయ పంటలు, ఆకు కూరల సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతుంది. NLG నగరం మూడువైపులా శరవేగంగా విస్తరిస్తుండడం, వ్యవసాయ భూములు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిపోతుండడం, మరోవైపు ప్రభుత్వపరంగా ఉద్యాన రైతులకు సహాయ సహకారాలు కొరవడటంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. దశాబ్ద కాలం క్రితం జిల్లాలో వందల ఎకరాలకుపైబడి విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయ పంటలు సాగయ్యేవి. ఇప్పుడు 30 శాతం కూడా సాగు చేయడం లేదు.

News January 24, 2026

NLG: సన్న బియ్యం ధరలకు రెక్కలు

image

నల్గొండ జిల్లాలో సామాన్యులకు సన్నబియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏటేటా బియ్యం రెట్టింపు అవుతున్నా అధికారులు కట్టడి చేయడం లేదు. గడిచిన నాలుగైదేండ్లుగా ఏటా వానకాలం సీజన్‌లో మిల్లుల వద్ద క్వింటా బియ్యం రూ.3వేల నుంచి రూ.3500 వరకు దొరికేది. ఈ ఏడాది గత పరిస్థితులకు భిన్నంగా వాటి ధరలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5,500, పాతవి రూ.6,000 పలుకుతున్నాయి.