News June 9, 2024
కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి!
కేంద్ర మంత్రివర్గంలోకి నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు అనూహ్యంగా చోటు దక్కింది. 1988లో బీజేపీలో కార్యకర్తగా ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. 1992-95లో ప.గో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పని చేశారు. 2008 నుంచి 2014 వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం కౌన్సిలర్గా గెలుపొందారు. ఇన్ఛార్జ్ ఛైర్మన్గానూ సేవలందించారు. కూటమి పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
Similar News
News October 7, 2024
భారత యువతిని పెళ్లాడనున్న పాక్ క్రికెటర్
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రజా భారత యువతి పూజను వివాహం చేసుకోనున్నారు. ఇటీవల న్యూయార్క్లో వీరి నిశ్చితార్థం జరగ్గా, ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పెళ్లికి ముందు పూజ ఇస్లాం మతాన్ని స్వీకరించనున్నట్లు రజా తెలిపారు. కాగా 32 ఏళ్ల హసన్ రజా పాక్ తరఫున ఒక వన్డే, 10 టీ20లు ఆడారు. అనంతరం ఆయన యూఎస్లో స్థిరపడ్డారు. పూజ ఫ్యామిలీ కూడా అక్కడే స్థిరపడింది.
News October 7, 2024
గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ ఆందోళన
INDvBAN టీ20 మ్యాచ్ జరిగిన గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ కార్యకర్తలు నల్ల జెండాలతో ఆందోళన చేశారు. బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతుంటే, ఆ దేశంతో క్రికెట్ ఆడటమేంటంటూ నినాదాలు చేశారు. మ్యాచ్ దృష్ట్యా ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయరాదంటూ స్థానిక జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ నిరసనకారులు లెక్కచేయకపోవడం గమనార్హం. వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
News October 7, 2024
రన్నింగ్ బస్సులో డ్రైవర్కు గుండెపోటు
TG: గుండెపోటుకు గురైనా ఆర్టీసీ డ్రైవర్ విధి నిర్వహణను మరువలేదు. 45 మంది ప్రాణాలను కాపాడి, ఆయన తనువు చాలించారు. హుజూరాబాద్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా గజ్వేల్ వద్దకు రాగానే డ్రైవర్ రమేశ్ సింగ్కు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆయన బస్సును సురక్షితంగా పక్కకు నిలిపి, కుప్పకూలిపోయారు. ప్రయాణికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు.