News June 10, 2024

KNR: రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు

image

KNR-WGL జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో <<13411201>>ఇద్దరు<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. వివరాలిలా.. శంకరపట్నం(M)కొత్తగట్టుకి చెందిన మహేశ్‌(18), అరవింద్‌చారి(16) బైక్‌పై కేశవపట్నం వస్తున్నారు. ఈ క్రమంలో KNR-HZB వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మహేశ్‌ ఇంటర్మీడియట్‌, అరవింద్‌చారి పదో తరగతి పూర్తి చేశాడు. SI లక్ష్మారెడ్డి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు.

Similar News

News October 3, 2024

కరీంనగర్: పెరుగుతున్న గుండె వ్యాధిగ్రస్థులు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మానసిక ఒత్తిడే కారణమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరంలో గుండె వ్యాధుల బాధితులు 30-50 ఏళ్లవారు 1760, 50 ఏళ్ల పైబడినవారు 2640 మంది ఉన్నట్లు వైద్య లెక్కలు చెబుతున్నాయి.

News October 3, 2024

KNR: మూడేళ్ల బాలికపై పిచ్చికుక్కలు దాడి

image

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లిలో మూడేళ్ల బాలికపై గురువారం పిచ్చికుక్కలు దాడి చేశాయి. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక అక్షర.. ఆడుకునేందుకు ఇంటి ముందరికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలికను చికిత్స నిమిత్తం వరంగల్ MGMకు తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

News October 3, 2024

ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

image

రాష్ట్రంలో ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని మానేరు డ్యాంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.