News June 10, 2024
కత్తిగాటు లేకుండా పోస్టుమార్టం.. త్వరలో ఏపీలో అందుబాటులోకి

కత్తిగాటు లేకుండా వర్చువల్ అటాప్సీ విధానంలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసే టెక్నాలజీ త్వరలో ఏపీలో రానుంది. ఈ విధానాన్ని అనుసరించాలని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చింది. సీటీ, ఎమ్మారై, 3D ఫొటోగ్రామ్మెట్రీ టెక్నాలజీ ఉన్న యంత్రంతో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. మృతదేహాన్ని బ్యాగుల్లో ఉంచి యంత్రంలోకి పంపిస్తే అన్ని కోణాల్లో ఇమేజెస్ జనరేట్ అవుతాయి. వాటిని బట్టి మృతికి గల కారణాలను నిర్ధారిస్తారు.
Similar News
News September 11, 2025
టీమ్ ఇండియాకు ఇదే ఫాస్టెస్ట్ విన్

ఆసియా కప్లో భాగంగా నిన్న UAEతో <<17672914>>మ్యాచులో<<>> భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. UAE నిర్దేశించిన 58 పరుగుల టార్గెట్ను ఇండియా 4.3 ఓవర్లలోనే ఛేదించింది. మరో 93 బంతులు మిగిలి ఉండగానే విక్టరీని అందుకుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో తన ఫాస్టెస్ట్ విన్ను నమోదు చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాంట్లాండ్పై సాధించిన విజయమే (81 బాల్స్ మిగిలి ఉండగా గెలిచింది) రికార్డుగా ఉంది.
News September 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 11, 2025
సెప్టెంబర్ 11: చరిత్రలో ఈరోజు

1906: దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ సత్యాగ్రహం ప్రారంభం
1911: భారత మాజీ కెప్టెన్ లాలా అమర్నాథ్ జననం
1895: స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే జననం
1947: కవి దువ్వూరి రామిరెడ్డి మరణం
1948: పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా మరణం
2022: నటుడు కృష్ణంరాజు మరణం (ఫొటోలో)
☞ జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం