News June 10, 2024

NZB: ఈ నెల 12న ఉద్యోగ మేళా

image

జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 12న ఉపాధి కార్యలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు NZB జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేళాలో పలు ప్రైవేట్ సంస్థలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. SSC, ITI ఎలక్ట్రిషన్, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు వారు అర్హులన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News July 5, 2025

డొంకేశ్వర్ మండలం నుంచి 41 మంది IIITకి ఎంపిక

image

డొంకేశ్వర్ మండలం నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఇందులో డొంకేశ్వర్ ZPHSకు చెందిన 26 మంది విద్యార్థులు ఉండటం విశేషం. 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. తొండాకూర్ ZPHS నుంచి 9, నికాల్పూర్ ZPHS ఐదుగురు, గాదేపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు. డొంకేశ్వర్ పాఠశాల హెచ్ఎం సురేశ్, తొండాకూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

News July 5, 2025

NZB: వరల్డ్ పోలీస్ గేమ్స్‌లో బాబాకు మరో బ్రాంజ్ మెడల్

image

వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ బాబా మరో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అమెరికాలోని అలబామాలో జరుగుతున్న వరల్డ్ పోలీస్ ఆండ్ ఫైర్ గేమ్స్‌లో భాగంగా 35 ఏళ్ల కేటగిరిలో బాబా 110 మీటర్ల హర్డిల్స్‌లో అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. 3వ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. అక్కడి భారతీయ అభిమానులు ఆయనను అభినందించారు.

News July 5, 2025

ట్రిపుల్ఐటీకి 14 మంది బెజ్జోరా పాఠశాల విద్యార్థులు

image

భీమ్‌గల్ మండలం బెజ్జోరా ఉన్నత పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీకి ఎంపికయ్యారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ఐటీకి ఎంపిక చేస్తారు. శుక్రవారం సాయంత్రం విడుదలైన బాసర ఆర్జీయూకేటీ ఫలితాల్లో ఒకేసారి 14 మంది విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉందని పాఠశాల హెడ్మాస్టర్ హఫీసుద్దీన్ అన్నారు. ఉపాధ్యాయ బృందానికి మండలంలోని పలువురు టీచర్స్ అభినందనలు తెలిపారు.