News June 10, 2024

చిత్తూరు: శునకానికి పదవీ విరమణ

image

డాగ్ స్క్వాడ్ విభాగం ఆవరణలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బిందు అనే శునకానికి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. 11 ఏళ్ల పాటు డిపార్ట్మెంట్‌కు శునకం సేవలు అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ మణికంఠ హాజరై సన్మానించారు. అది చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డి.ఎస్.పి మహబూబ్ బాషా, ఆర్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 1, 2025

కుప్పం: మెడికో ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా..?

image

కుప్పం మెడికల్ కళాశాలలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హర్షవర్ధన్ (24) మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. పీజీ అనస్తీషియా చేస్తున్న హర్షవర్ధన్ ఉదయం ఆసుపత్రిలో ఓ సర్జరీ కేసు చూసుకుని మధ్యాహ్నం లంచ్ సమయంలో హాస్టల్ గదిలోకి వెళ్లి హై డోస్ ఇంజక్షన్ వేసుకోవడంతో కార్డియాక్ అరెస్టై మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు నంద్యాల జిల్లా డోన్ కు చెందిన నాగరాజు కుమారుడు హర్షవర్ధన్‌గా సమాచారం.

News November 1, 2025

పరకామణి కేసులో నిందితుడు, ప్రతివాదులకు నోటీసులు…!

image

పరకామణి కేసులో ప్రధాన నిందితుడైన సీవీ రవి కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ప్రతివాదులైన అప్పటి ఏవీఎస్వో సతీశ్ కుమార్, ఎండోమెంట్ చీఫ్ సెక్రటరీ, ఏపీ లీగల్ సర్వీస్ సెక్రటరీ, సీఐడీ డీజీ, టీటీడీ ఈవో, సీవీఎస్వో, తిరుమల – 1 టౌన్ సీఐలతో పాటు మరి కొందరికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని అందులో పేర్కొంది.

News October 31, 2025

CTR: పదేళ్ల నుంచి జైల్లోనే ఆ ఇద్దరు..!

image

చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. 2015 నవంబర్ 15న హత్య జరిగిన తర్వాత ఐదుగురు అరెస్ట్ అయ్యారు. పలువురికి కండిషన్ బెయిల్ వచ్చింది. ఇదే కేసులో A3గా ఉన్న జయప్రకాశ్, ఏ4 మంజునాథ్‌కు చాలా కారణాలతో బెయిల్ రాలేదు. కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటికీ జైల్లోనే జీవితం గడుపుతున్నారు. మిగిలిన వాళ్లు జైలు నుంచి విడుదలయ్యారు. తీర్పు రావడంతో మరోసారి జైలుకు వెళ్లారు.