News June 10, 2024

పాండురంగాపురం వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహం

image

వాడరేవు వద్ద సముద్రంలో ఆదివారం సాయంత్రం గల్లంతైన కావూరివారిపాలెంకు చెందిన జైపాల్ మృతదేహం సోమవారం మధ్యాహ్నం బాపట్ల పక్కన ఉండే పాండు రంగాపురం వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో అక్కడి మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని చీరాల రూరల్ పోలీసులకు విషయాన్ని తెలిపారు. జైపాల్‌తో సహా ముగ్గురు వాడరేవులో సముద్ర స్నానానికి వెళ్లగా ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Similar News

News September 13, 2025

రేగలగడ్డలో భార్యను చంపి, భర్త ఆత్మహత్యాయత్నం

image

మర్రిపూడిలోని రేగలగడ్డలో దారుణం జరిగింది. నారాయణ భార్య అంజమ్మను శుక్రవారం రాత్రి గొంతుకోసి చంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంజమ్మ చనిపోగా.. నారాయణ కొన ఊపిరితో ఉన్నాడు. గ్రామస్థులు సమాచారం పోలీసులకు అందజేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 12, 2025

ప్రకాశం: బార్ల లైసెన్సులకు గడువు పొడిగింపు

image

ప్రకాశం జిల్లాలోని 4 ఓపెన్ కేటగిరి బార్ల లైసెన్సులకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 ఓపెన్ బార్ల లైసెన్స్‌ల కొరకు దరఖాస్తు గడువు గతంలో 14వ తేదీ వరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ గడువు తేదీని 17 వరకు పొడిగించామన్నారు.

News September 12, 2025

ఉలవపాడు: బాలికపై సచివాలయం ఉద్యోగి అత్యాచారం

image

ఉలవపాడులో ఇటీవల ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం వెలుగు చూసింది. SI అంకమ్మ వివరాల ప్రకారం.. ఇటీవల అనాధగా కనిపించిన బాలిక(13)ను పోలీసులు సంరక్షించి అనాధ ఆశ్రమంలో చేర్చారు. సింగరాయకొండలో సచివాలయ ఉద్యోగిగా చేస్తున్న రామకృష్ణ ఇంట్లో బాలిక పనిమనిషిగా చేసింది. ఈక్రమంలో బాలికను బెదిరించి రామకృష్ణ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.