News June 10, 2024

NZB: రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి

image

జిల్లాలోని సిర్నాపల్లి, ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పైన సోమవారం గుర్తు తెలియని మగ వ్యక్తి (35) మృతదేహం లభ్యమైనట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. రైలులో నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్యం చేశారు. మృతుడి కుడి చేయి పైన కవిత అని పచ్చ బొట్టు ఉన్నట్లు గుర్తించారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.

Similar News

News October 4, 2024

NZB: ‘సన్నాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి’

image

సన్నాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. వచ్చే జనవరి మాసం నుంచి రాష్ట్ర ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందించనున్న దృష్ట్యా, రైతులు సన్న రకాలకు చెందిన వరి ధాన్యం పండించేలా ప్రోత్సహించాలని సూచించారు.

News October 3, 2024

NZB: ‘ఈనెల 5లోగా DSC సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయండి’

image

డీఎస్సీ ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ ప్రకారం 1:3 నిష్పత్తిలో చేపడుతున్న సర్టిఫికెట్ల పరిశీలనను ఈనెల 5లోగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. ఈనెల 9న హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు.

News October 3, 2024

ఉమ్మడి జిల్లాలో దేవీ నవరాత్రుల సందడి

image

నేటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి మందిరంలో అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. దసరా వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక్కడి అమ్మవారు భక్తుల కోరికలు నెరవేర్చే తల్లిగా విరాజిల్లుతున్నారు.