News June 10, 2024
చిక్కుల్లో అమేథీ MP?

కాంగ్రెస్ MP కిషోరీలాల్ శర్మ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఆయన అఫిడవిట్ పేరుతో ఓ ఫొటో వైరలవుతోంది. అందులో 18వ లోక్సభకు బదులుగా 17వ లోక్సభ ఎన్నికలకు దరఖాస్తు చేస్తున్నట్లు ఉంది. సాధారణంగా అఫిడవిట్లో తప్పులుంటే అధికారులు తిరస్కరిస్తారు. మరి శర్మ అఫిడవిట్ ఎలా స్వీకరించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమేథీలో BJP అభ్యర్థి స్మృతీ ఇరానీపై KL శర్మ సంచలన విజయం సాధించారు.
Similar News
News September 13, 2025
ఒంటరిగా ఉండకండి.. ఇది ప్రమాదకరం!

ప్రస్తుతం ఒంటరితనం ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. సోషల్ మీడియాలో ఉంటూ సమాజానికి దూరం కావడం, ఆర్థిక పరిస్థితులు, పట్టణీకరణ వంటి కారణాలతో ఒంటరితనం పెరిగినట్లు WHO పేర్కొంది. ఇది కేవలం మానసిక సమస్య కాదు, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలకూ దారితీస్తుంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8,71,000 మందికిపైగా చనిపోతున్నట్లు వెల్లడించింది. అంటే ఒంటరితనం వల్ల గంటకు 100 మంది చనిపోతున్నారన్నమాట.
News September 13, 2025
ALERT: ITR ఫైల్ చేయడం లేదా?

2024-25FYకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ITR) ఫైల్ చేయడానికి మరో 2 రోజులే గడువు ఉంది. కేంద్రం రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇచ్చిందని చాలామంది ఫైల్ చేయడం లేదు. కానీ ఈ నిర్ణయం 2025-26 నుంచి అమల్లోకి రానుంది. 2024-25లో ఆదాయం రూ.3 లక్షలు దాటినవారు కూడా ఇప్పుడు ITR ఫైల్ చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. SEP 15 డెడ్లైన్ దాటితే రూ.5వేల వరకు పెనాల్టీ పడుతుందని హెచ్చరిస్తున్నారు.
News September 13, 2025
రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దు: పవన్ కళ్యాణ్

AP: తనపై దుష్ప్రచారం చేసేవారిని ప్రజాస్వామ్యయుతంగా, చట్టప్రకారమే తిప్పికొట్టాలని జనసైనికులకు Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. ఘర్షణ పడడం ద్వారా సమస్య మరింత జటిలమవుతుందని పేర్కొన్నారు. ‘పదేళ్లుగా మనపై కుట్రలు చేస్తున్నవారిని చూస్తూనే ఉన్నాం. అలాంటివారి ఉచ్చులో పడొద్దు. ఎవరూ ఆవేశానికి గురై గొడవలకు దిగవద్దు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించేవారిని చట్టం ముందు నిలబెట్టాలి’ అంటూ దిశానిర్దేశం చేశారు.