News June 11, 2024

తిరుపతి: పండుగ వాతావరణంలో ప్రమాణస్వీకారం: కలెక్టర్

image

ఈ నెల 12 వ తేది జరగబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఔత్సాహికులైన ప్రజలను నియోజకవర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటు చేసి విజయవాడ సభకు తరలించాలని పేర్కొన్నారు. ప్రతి మండల కార్యాలయం, కళ్యాణ మండపాల్లో పండుగ వాతావరణంలో ప్రత్యక్ష ప్రసార వీక్షణకు
ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Similar News

News December 29, 2025

తిరుమల: 365 రోజులు.. 450 ఉత్సవాలు

image

ఏడాదికి 365 రోజులే. కానీ కోరిన కోర్కెలు తీర్చే తిరుమల కోనేటి రాయుడికి ఏడాదిలో 450పైగా ఉత్సవాలు జరుగుతాయి. సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం నక్షత్రోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పద్మావతి పరిణయం తదితర ఉత్సవాలు చేస్తారు. ఇలా రోజూ ఒక పండగగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా తిరుమల విరాజిల్లుతోంది.

News December 29, 2025

26 మండలాలకు తగ్గనున్న చిత్తూరు జిల్లా

image

కొత్త చిత్తూరు జిల్లా 32 నుంచి 26 మండలాలకు పరిమితం కానుంది. <<18703423>>పుంగనూరు<<>> నియోజకవర్గం(6 మండలాలు)ను అన్నమయ్య జిల్లాలో కలుపుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య సైతం 7 నుంచి 6కు చేరుకుంది.

News December 29, 2025

OFFICIAL: చిత్తూరు నుంచి పుంగనూరు ఔట్

image

చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, పుంగనూరుతో అన్నమయ్య జిల్లాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె ఉంటుంది. మరోవైపు బంగారుపాళ్యాన్ని పలమనేరు డివిజన్‌ నుంచి చిత్తూరులో కలిపారు. తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు విలీనానికి గ్రీన్ సిగ్నల్ చ్చారు. జనవరి 1 నుంచి మార్పులు అమలులోకి రానున్నాయి.