News June 11, 2024
EPFO: కేవైసీ ఉంటే చెక్ అవసరం లేదు!

ఉద్యోగుల క్లెయిమ్లు తిరస్కరణకు గురికాకుండా ఈపీఎఫ్వో మరో వెసులుబాటు కల్పించింది. చందాదారుడి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఈకేవైసీ పూర్తయితే క్లెయిమ్ సమయంలో చెక్, పాస్బుక్ కాపీలు జత చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈమేరకు క్లెయిమ్ దరఖాస్తు సమయంలో నోట్ కనిపిస్తుందని తెలిపింది. దీంతో ఈపీఎఫ్ క్లెయిమ్లు సత్వరం పరిష్కారం అవుతాయని సంస్థ భావిస్తోంది.
Similar News
News January 7, 2026
25 రన్స్ చేస్తే సచిన్ను దాటనున్న కోహ్లీ!

ఈ నెల 11న ప్రారంభమయ్యే NZతో వన్డే సిరీస్లో సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టే అవకాశాలున్నాయి. మరో 25 పరుగులు చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్లో వేగంగా 28వేల పరుగులకు చేరుకున్న క్రికెటర్గా నిలవనున్నారు. కోహ్లీ 3 ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్లో 27,975 రన్స్ చేశారు. మరోవైపు 28వేల రన్స్ మైలురాయిని అందుకోవడానికి సచిన్కు 644 ఇన్నింగ్స్ అవసరం కాగా, సంగక్కర 666 ఇన్నింగ్స్ ఆడారు.
News January 7, 2026
US బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

ఇటీవల వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్ వేళ US ఆర్మీ చేసిన మెరుపుదాడిలో 55 మంది వెనిజులా, క్యూబా సైనికులు చనిపోయినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. వీరిలో వెనిజులాకు చెందిన 23, క్యూబా సైనికులు 32మంది ఉన్నట్లు పేర్కొన్నాయి. మృతిచెందిన తమ సైనికుల వయసు 26-27ఏళ్ల మధ్య ఉంటుందని క్యూబా చెప్పింది. అటు ఈ దాడుల్లో మదురో భద్రతా సిబ్బంది చాలా వరకు చనిపోయినట్లు వెనిజులా రక్షణ మంత్రి పాడ్రినో లేపెజ్ తెలిపారు.
News January 7, 2026
ధనుర్మాసం: ఇరవై మూడో రోజు కీర్తన

ఈ పాశురం కృష్ణుడి రాకను వర్ణిస్తుంది. సింహం మేల్కొన్నాక జూలు విదిల్చి గర్జిస్తూ బయటకు వచ్చినట్లు కృష్ణుడు తన శయనం నుంచి లేచి రావాలని గోపికలు కోరుతున్నారు. సింహంలా శత్రువులను హడలెత్తించే పరాక్రమం ఉన్నా, భక్తులతో సుందరంగా, దయతో వ్యవహరించే స్వామిని తమ అభీష్టాలను వినమని వేడుకుంటున్నారు. సింహాసనాన్ని అలంకరించి, తమ మొర ఆలకించి, మోక్షాన్ని ప్రసాదించమని ఆండాళ్ తల్లి స్వామిని ఆహ్వానించింది. <<-se>>#DHANURMASAM<<>>


