News June 11, 2024

త్రిపురాంతకం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

image

త్రిపురాంతకం మండలం కేసినేనిపల్లి ఫ్లైఓవర్ వద్ద లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి ఆర్మీ జవాన్ ఓబులేసు (35)గా పోలీసులు గుర్తించారు. ఇతడిది పోరుమామిళ్ల గ్రామమని, బంధువులకు సమాచారం అందించినట్లు
ఎస్సై సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Similar News

News December 31, 2025

ప్రకాశం పుష్కలం.!

image

ప్రకాశం జిల్లాను ప్రకటించడంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులేసిందనే చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం విడిపోగానే, ఆ స్థానాన్ని అద్దంకి, కందుకూరు డివిజన్లతో భర్తీ చేసింది. బాపట్ల జిల్లాలోని అద్దంకిని, నెల్లూరు జిల్లాలోని కందుకూరు డివిజన్లను ప్రకాశంలోకి కలపడంతో ఈ రెండు ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు ప్రజలకు నెల్లూరు 102 కి.మీ దూరం ఉండగా, ఒంగోలు 43 కి.మీ దూరంలోనే ఉంది.

News December 31, 2025

మార్కాపురం జిల్లా.. పెను సవాళ్లు ఇవేనా?

image

ఎట్టకేలకు మార్కాపురం జిల్లాగా ప్రకటించబడింది. 40 ఏళ్ల కల నెరవేరింది. కానీ మున్ముందు పెను సవాళ్లు కొత్త జిల్లాకు ఎదురుకానున్నాయని చర్చ సాగుతోంది. ప్రధానంగా జిల్లా అధికార యంత్రాంగానికి సరిపడ భవనాల కొరత వేధిస్తోంది. దీంతో ప్రభుత్వం నిధులను వెచ్చించి వాటిని నిర్మించాల్సి ఉంది. పారిశ్రామికంగా జిల్లాను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజలు మాత్రం ఉందిలే మంచి కాలం ముందుముందున అంటున్నారు.

News December 31, 2025

మార్కాపురం జిల్లాకు సిబ్బంది కేటాయింపు

image

మార్కాపురం నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బందిని నియమిస్తూ ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ రాజబాబు ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ అడ్మిన్ సెక్షన్ – 2, సూపరింటెండెంట్ మెజిస్ట్రేరియల్ సెక్షన్1, సూపరింటెండెంట్ కోఆర్డినేషన్ సెక్షన్ 2, సూపరింటెండెంట్ ల్యాండ్స్ 1 సెక్షన్-2, ల్యాండ్స్ 2 సెక్షన్ 1, పీజీఆర్ఎస్ 4, డ్రైవర్స్ 3, ఆఫీస్ సబార్డినేట్స్- 5 మందిని కేటాయించారు.