News June 11, 2024
అల్లుడి కోసం బాలకృష్ణ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు: కేఏ పాల్

AP: వైజాగ్లో అల్లుడిని గెలిపించేందుకు బాలకృష్ణ ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రధాని అయ్యే అవకాశాన్ని జూన్ 5నే కోల్పోయారని చెప్పారు. టీడీపీని, జేడీయూను వాడుకొని మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి హామీలు నెరవేర్చాలని మోదీని CBN అడిగి ఉంటే బాగుండేదని చెప్పారు.
Similar News
News September 12, 2025
ఆసియా కప్: హాంకాంగ్పై బంగ్లాదేశ్ విజయం

ఆసియా కప్లో హాంకాంగ్తో మ్యాచులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 143/7 స్కోర్ చేయగా, అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. కెప్టెన్ లిటన్ దాస్ 59, హృదోయ్ 35 రన్స్తో రాణించారు. రేపు గ్రూప్-Aలో ఉన్న పాక్, ఒమన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
News September 12, 2025
నేటి ముఖ్యాంశాలు

* శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్: సీఎం రేవంత్
* నేపాల్ నుంచి స్వస్థలాలకు చేరుకున్న ఏపీ వాసులు
* ఏపీలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
* కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారు: సజ్జల
* ఈనెల 15 నుంచి చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు
* గ్రూప్-1పై జుడీషియల్ కమిషన్ వేయాలి: కేటీఆర్
News September 12, 2025
బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో టీటీడీ ఈవో భేటీ

AP: బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ అధికారులకు సూచించారు. ఈ వేడుకల్లో పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాలని చెప్పారు. రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని తెలిపారు. 3,500 మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని, మెట్ల మార్గాల్లో భద్రత మరింత పటిష్ఠం చేయాలని దిశానిర్దేశం చేశారు.