News June 11, 2024
ఈ ఫేక్ రాతలకే 11 సీట్లు ఇచ్చారు: TDP

AP: అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు సుందరీకరణ, LED లైటింగ్ ఏర్పాటు జగన్ హయాంలో జరిగిందన్న YCP ట్వీట్పై TDP మండిపడింది. ‘అమరావతిపై పగబట్టి, కులం అంటగట్టి, APకి రాజధాని లేకుండా చేసి, సిగ్గు లేకుండా జగన్ డెవలప్ చేశాడంటావా? ఈ ఫేక్ రాతలకే 11 సీట్లు ఇచ్చింది. 2019లో ఇలా ఉన్న అమరావతిని నాశనం చేసింది మీరేగా? ఇలాగే ఫేక్ చేస్తే ఉన్న 11 కూడా ఊడబీకుతారని, మీ పులివెందుల MLAకి చెప్పు’ అని Xలో రిప్లై ఇచ్చింది.
Similar News
News September 12, 2025
ఆసియా కప్: హాంకాంగ్పై బంగ్లాదేశ్ విజయం

ఆసియా కప్లో హాంకాంగ్తో మ్యాచులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 143/7 స్కోర్ చేయగా, అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. కెప్టెన్ లిటన్ దాస్ 59, హృదోయ్ 35 రన్స్తో రాణించారు. రేపు గ్రూప్-Aలో ఉన్న పాక్, ఒమన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
News September 12, 2025
నేటి ముఖ్యాంశాలు

* శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్: సీఎం రేవంత్
* నేపాల్ నుంచి స్వస్థలాలకు చేరుకున్న ఏపీ వాసులు
* ఏపీలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
* కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారు: సజ్జల
* ఈనెల 15 నుంచి చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు
* గ్రూప్-1పై జుడీషియల్ కమిషన్ వేయాలి: కేటీఆర్
News September 12, 2025
బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో టీటీడీ ఈవో భేటీ

AP: బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ అధికారులకు సూచించారు. ఈ వేడుకల్లో పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాలని చెప్పారు. రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని తెలిపారు. 3,500 మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని, మెట్ల మార్గాల్లో భద్రత మరింత పటిష్ఠం చేయాలని దిశానిర్దేశం చేశారు.