News June 12, 2024
MBNR: కృష్ణ, తుంగభద్ర నదులకు వరద

కృష్ణ, జూరాల, తుంగభద్ర నదులకు వరద వస్తోంది. కర్ణాటకలో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 4. 94 టీఎంసీల నీళ్లున్నాయి. 7211 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తున్నది. వరద నీరు ఆర్డీఎస్ మీదుగా మండలంలోని పులికల్ సమీపంలో ఉన్న నాగల దిన్నె బ్రిడ్జి వద్దకు చేరుకుంది. 2 నెలలుగా ఎండిన తుంగభద్రకు వరద రావడంతో నదీ తీర గ్రామాల ప్రజలు, రైతులు ఊరట చెందారు.
Similar News
News May 8, 2025
మహబూబ్నగర్ రూరల్లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సరిత (28), రాజేశ్(35) దంపతులు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై, సీఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
News May 8, 2025
మహబూబ్నగర్ రూరల్లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సరిత (28), రాజేశ్(35) దంపతులు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై, సీఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
News May 8, 2025
తప్పుడు పోస్టులు పెట్టకూడదు: ఎస్పీ

దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకూడదని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సూచించారు. దేశ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారన్నారు. పోలీసులకు ప్రస్తుతం సెలవులను రద్దు చేసినట్టు వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదన్నారు.