News June 12, 2024

MBNR: చెరువులకు పొంచి ఉన్న ముప్పు

image

ఉమ్మడి జిల్లాలో 6,491 చెరువులు ఉన్నాయి. ఆయకట్టు కలిగిన చెరువులు 672, 100ఎకరాలకు లోబడి ఆయకట్టు కలిగిన చెరువులు, కుంటలు 5,819ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తే చాలా చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదముంది. మరమ్మతులు చేపట్టకపోవటమే దీనికి కారణం. గతేడాది వర్షాలకు కట్టలు కుంగి దెబ్బతిన్నాయి. తూముల్లో మట్టి, మొక్కలు మొలిచాయి. చెరువులను ఇటు నీటి పారుదల శాఖ, అటు రెవెన్యూ శాఖ పర్యవేక్షణ ఆరేళ్లుగా పూర్తిగా కొరవడింది.

Similar News

News October 4, 2024

12న పాలమూరుకి సీఎం రేవంత్ రెడ్డి

image

దసరా పండుగకు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరికి రానున్నారు. ఈనెల 12న దసరా పండుగ సందర్భంగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని అక్కడ వేడుకలలో పాల్గొంటారు.. అదేవిధంగా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏడాది దసరాను రేవంత్ రెడ్డి ఇక్కడే జరుపుకుంటారు.

News October 4, 2024

రేపు మన్ననూరులో గద్దర్ విగ్రహవిష్కరణ

image

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామంలో రేపు గద్దర్ విగ్రహవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు పలువురు బహుజన మేధావులు హాజరు అవుతారన్నారు. ఏపూరి సోమన్న బృందంతో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

News October 4, 2024

సంగాల చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే

image

గద్వాల మండలంలోని సంగాల చెరువులో శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నీటిలో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ఈ ఏడాది నియోజకవర్గంలో ప్రతి చెరువుకు ప్రభుత్వం నుంచి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.