News June 12, 2024
వరంగల్లో పెరగనున్న భూముల రిజస్ట్రేషన్ ఛార్జీలు
ఉమ్మడి WGL వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువ పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా ఏడాదికి రూ.320 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. పెంచితే ఏడాదికి రూ.500 కోట్లకు పైగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ప్రశాంత్నగర్ కాలనీలో బయటి మార్కెట్ ప్రకారం గజానికి రూ.40నుంచి రూ.50వేల వరకు పలుకుతోంది. మార్కెట్ విలువ రూ.9వేలు ఉంది. ఇలాంటి చోట్ల 40-50శాతం ఛార్జీలు పెంచే అవకాశముంది.
Similar News
News October 4, 2024
వరంగల్: తగ్గిన మిర్చి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు తగ్గాయి. వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.15,500 ధర రాగా.. నేడు రూ.15వేలకి తగ్గింది. అలాగే తేజమిర్చికి నిన్న రూ.18,500 ధర రాగా నేడు రూ.18వేల ధర వచ్చింది. మరోవైపు 341 రకం మిర్చి రూ.15,800 ధర పలకగా నేడు రూ.15 వేలకు పడిపోయింది.
News October 4, 2024
వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి నేడు శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ధరలు మాత్రం నిన్నటి లాగే తటస్థంగా ఉన్నాయి. గురువారం క్వింటా పాత పత్తి ధర రూ.7,450 ధర పలకగా.. నేడు కూడా అదే ధర పలికింది. అలాగే కొత్తపత్తికి నిన్న రూ.6,925 ధర రాగా నేడు రూ.6,925 అదే ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News October 4, 2024
మలుగు: రోడ్డుపై భారీ కొండచిలువ
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి కుమ్మరిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ కొండచిలువ గురువారం రాత్రి ప్రత్యక్షమైంది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 10 అడుగుల పొడవు ఉందని స్థానికులు తెలిపారు. కాగా ప్రయాణికుల చప్పుడుతో పొదల్లోకి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.