News June 12, 2024
IND vs USA: శివమ్ దూబేపై వేటు?

టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ USAతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఓ మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తున్న ఆల్రౌండర్ శివమ్ దూబేను జట్టు నుంచి తప్పించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో వికెట్ కీపర్ సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు టాక్. కాగా T20 WCకు ఎంపికైనప్పటి నుంచి దూబే ఫామ్ కోల్పోయి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు.
Similar News
News September 12, 2025
భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధరలు

AP: రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా కిలో రూ.2కి పడిపోయింది. నంద్యాల, మదనపల్లె మార్కెట్లలో రూ.3-రూ.10 వరకు పలికింది. అటు కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు ఉల్లి క్వింటా రూ.150 చొప్పున కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. దీంతో కూలీ ఖర్చులు కూడా రావట్లేదని వాపోయారు.
News September 12, 2025
నేడే లాస్ట్.. టెన్త్ అర్హతతో 515 పోస్టులు

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) 515 ఆర్టిసన్ గ్రేడ్ 4 పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. అభ్యర్థులు టెన్త్, ఐటీఐ పాసై 27 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.29,500 నుంచి రూ.65,000 వరకు ఉంటుంది. నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి https://careers.bhel.in/ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News September 12, 2025
నేడు విజయవాడలో Way2News కాన్క్లేవ్

AP: విజయవాడలో ఇవాళ Way2News కాన్క్లేవ్ నిర్వహించనుంది. CM చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, MPలు భరత్, హరీశ్ బాలయోగి పాల్గొననున్నారు. YCP నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం కాన్క్లేవ్కు హాజరుకానున్నారు. రానున్న పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందనే వివిధ అంశాలపై వీరు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. మ.12గంటల నుంచి యాప్లో LIVE వీక్షించొచ్చు.