News June 12, 2024
న్యూయార్క్ స్టేడియం కూల్చివేస్తారా?

భారత్-యూఎస్ఏ మధ్య జరిగే మ్యాచ్ న్యూయార్క్లోని నసావు స్టేడియానికి చివరిదిగా తెలుస్తోంది. ఈ మ్యాచ్ అనంతరం స్టేడియాన్ని కూల్చివేయనున్నట్లు సమాచారం. కాగా టీ20 వరల్డ్ కప్ కోసమే ఈ స్టేడియాన్ని నిర్మించారు. రూ.240 కోట్లతో మూడు నెలల్లోనే దీని నిర్మాణం పూర్తి చేశారు. ఈ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్లు ఏర్పాటు చేశారు. టోర్నీలో ఈ మైదానంలో అన్ని మ్యాచ్లూ లోయెస్ట్ టోటల్తోనే ముగిశాయి.
Similar News
News November 1, 2025
అది చెడు పాలన ఫలితం: అజిత్ దోవల్

చెడు పాలన పరిణామాలతో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లో ప్రభుత్వాలు మారాయని NSA అజిత్ దోవల్ అన్నారు. ఆర్థిక వైఫల్యాలు, ఆహార కొరత, ద్రవ్యోల్బణం, సామాజిక సంఘర్షణలే వాటి పతనానికి కారణమని పేర్కొన్నారు. దేశాలను నిర్మించడంలో బలమైన పాలన ఎంతో ముఖ్యమని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో చెప్పారు. దేశంలో టెర్రరిజాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామని, J&K తప్ప ఎక్కడా 2013 నుంచి టెర్రర్ అటాక్ జరగలేదని తెలిపారు.
News November 1, 2025
ఆమెకు మతం మారే ఆలోచన లేదు: జేడీ వాన్స్

హిందువైన తన భార్య ఉష <<18155411>>క్రైస్తవంలోకి మారే <<>>ఛాన్స్ ఉందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీంతో ఆయన క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. తన భార్య క్రిస్టియన్ కాదని, మతం మారే ఆలోచన కూడా ఆమెకు లేదని చెప్పారు. అయితే ఏదో ఒకరోజు తాను చూసినట్లే తన భార్య చూస్తుందని భావిస్తున్నానని తెలిపారు. సువార్త నిజమని, అందరికీ మంచిదని క్రైస్తవం చెబుతుందని అన్నారు.
News November 1, 2025
అమెరికాలో ఉగ్రదాడులకు కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్బీఐ

అమెరికాలో ఉగ్ర దాడుల కుట్రను భగ్నం చేసినట్లు FBI డైరెక్టర్ కాశ్ పటేల్ తెలిపారు. మిషిగన్లో హాలోవీన్ వీకెండ్లో హింసాత్మక దాడులకు ప్లాన్ చేసిన పలువురిని అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. FBI ఏజెంట్లు, అధికారులు దేశాన్ని రక్షిస్తున్నారని అభినందించారు. అంతకుముందు మిషిగన్లో FBI సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు డియర్బర్న్ పోలీసులు వెల్లడించారు.


