News June 12, 2024
ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపడమే నా కర్తవ్యం: కొండపల్లి శ్రీనివాస్

కొండపల్లి శ్రీనివాస్ మంత్రి పదవి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితం యువకులు రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. 4 నెలల క్రితం MLA టిక్కెట్ ఇస్తే బాధ్యతగా పనిచేసి గెలిచానన్నారు. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం వలసపోతున్నారని, పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి వలసలను ఆపడమే కర్తవ్యంగా పనిచేస్తానని తెలిపారు.
Similar News
News September 17, 2025
గంట్యాడ: చికిత్స పొందుతూ మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ మంగళవారం మృతి చెందింది. భీమవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి ఈనెల 12న రాత్రి గంట్యాడ మండలం కొండతామరపల్లి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 16, 2025
సీఎం సమీక్షలో విజయనగరం జిల్లా నూతన రథసారథులు

రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా నూతన కలెక్టర్ ఎస్.రామ సుందరరెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
News September 16, 2025
పేదరిక నిర్మూలనే పీ-4 లక్ష్యం: VZM జేసీ

పేదరిక నిర్మూలనే పీ-4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జేసీ ఎస్.సేతు మాధవన్ స్పష్టం చేశారు. మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. పీ-4 కార్యక్రమం, బంగారు కుటుంబాలు, మార్గదర్శుల పాత్రపై సచివాలయం నుంచి ఎంపిక చేసిన ఎంవోటీ, టీవోటీలకు కలెక్టరేట్లో మంగళవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.