News June 12, 2024
బొబ్బిలి-డొంకినవలస మధ్య పట్టాలపై డెడ్బాడీ

బొబ్బిలి-డొంకినవలస రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తించామని రైల్వే ఎస్ఐ రవి వర్మ బుధవారం తెలిపారు. వ్యక్తి వయస్సు 35 సంవత్సరాలు ఉంటాయన్నారు. రైలు ఢీకొనడంతో కానీ రైలు నుంచి కిందపడి కానీ మృతి చెంది ఉంటాడని ఎస్ఐ వెల్లడించారు. మృతిని వివరాలు తెలిసిన వారు జీఆర్పీ స్టేషన్కి సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News November 7, 2025
VZM: కంచం చేత పట్టి లైన్లో నిల్చున్న కలెక్టర్

గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు బోధన చేయడమే కాకుండా వారితో పాటు కంచం పట్టుకుని లైన్లో నిల్చున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.
News November 7, 2025
VZM: సబ్సిడీ కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు

సఫాయి కర్మచారి యువతకు NSKFDC పథకం కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు సబ్సిడీపై మంజూరు చేయనున్నట్లు SC కార్పొరేషన్ ED వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాకు కేటాయించిన మూడు వాహనాలకు కొత్త లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఐదుగురు సఫాయి కర్మచారులు కలిసి గ్రూపుగా దరఖాస్తు చేసుకోవాలని, వారిలో ఒకరికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. జిల్లా కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలన్నారు.
News November 7, 2025
వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి పని: VZM కలెక్టర్

ప్రతి మండలంలో కనీసం వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి పనులు కల్పించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. MNREGS పథకం అమలుపై శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తక్కువ ప్రగతి ఉన్న మండలాలపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే వారం నాటికి 20% పనులు ప్రారంభించాలని, సగటు వేతనాన్ని పెరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.పనికల్పనలో వెనుకబడిన మండలాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


