News June 12, 2024

తీర్యాని: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

image

తల్లి మందలించిందని యువతి పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన తీర్యాని మండలంలో జరిగింది. ఎస్ఐ రమేశ్ వివరాల ప్రకారం.. భింజీగూడ గ్రామపంచాయతీకి చెందిన ఇంద్ర భాయ్ (16)అనే యువతి తరచూ ఫోన్లో మాట్లాడుతుందని తల్లి మందలించింది. దీంతో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ఆసుపత్రి, అక్కడి నుంచి మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు.

Similar News

News September 14, 2025

ADB: లోక్ అదాలత్‌లో న్యాయం: జిల్లా జడ్జి

image

లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు, రాజీమార్గమే రాజమార్గం అని తెలిపారు. బోథ్ జూనియర్ కోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప్, రాజీ ద్వారా 34 క్రిమినల్ కేసులు, ఒక సివిల్ వివాదం, నేరం ఒప్పుకోవడం ద్వారా 22 ఎక్సైజ్ కేసులు, 429 ఎస్టీసి కేసులను పరిష్కరించారు.

News September 13, 2025

ఆదిలాబాద్‌కు కాస్త ఊరట.. మళ్లీ భారీ వర్షాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కాస్త ఎడతెరిపినిచ్చాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 22.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా, మిగతా మండలాల్లో జల్లులు మాత్రమే కురిశాయి. ఈనెల 15వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News September 13, 2025

ADB: డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు

image

ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ జె.సంగీత పేర్కొన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ ఉర్దూ మీడియంలో 17, ఇంగ్లీష్ మీడియంలో 49, తెలుగు మీడియంలో 56, ఫిజికల్ సైన్సెస్‌లో 20 సీట్లు ఉన్నట్లు తెలిపారు.