News June 12, 2024
ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడ్డ హెజ్బొల్లా
లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడింది. తన దళానికి చెందిన టాప్ కమాండర్ హజ్ అబూ తలేబ్ను ఇజ్రాయెల్ చంపడంతో ప్రతీకార దాడికి దిగింది. నార్త్ ఇజ్రాయెల్పై భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. ప్రాణనష్టంపై సమాచారం అందలేదు. కాగా ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్న హమాస్ మిలిటెంట్లకు హెజ్బొల్లా మద్దతు ప్రకటించింది. ఈ గ్రూప్కు ఇరాన్ సాయమందిస్తోంది.
Similar News
News October 6, 2024
నెల్లూరు: దసరాకు ఊర్లకు వెళ్లేవారికి హెచ్చరిక
నెల్లూరు జిల్లాలో దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలని ఎస్పీ జి క్రిష్ణ కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. LHMS యాప్, 9440796383, 9392903413 నంబర్ లకు, స్థానిక పోలీసులను సంప్రదించి LHMS సేవలు ఉచితంగా పొందవచ్చన్నారు. డబ్బు, విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్లకూడదని బ్యాంకులో ఉంచుకోవాలన్నారు.
News October 6, 2024
ఉజ్వల భవిష్యత్తుకు ప్రపంచ శాంతి అవసరం: మోదీ
మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ శాంతి అత్యవసరమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. దేశాల మధ్య ఐక్యత, భాగస్వామ్యం ద్వారానే సామూహిక ప్రయత్నాల విజయం ఆధారపడి ఉందన్నారు. ICJ-ICWకు రాసిన లేఖలో ప్రధాన న్యాయమూర్తులు, మంత్రులు, న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు, రచయితలు, సంపాదకులు, న్యాయ విద్యావేత్తల భాగస్వామ్యం ప్రపంచ శాంతికి విధానాల రూపకల్పనలో కీలకమని పేర్కొన్నారు.
News October 6, 2024
WOW.. 65 అడుగుల దుర్గామాత విగ్రహం
ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం మాదిరిగా ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గామాత విగ్రహాన్ని హైదరాబాద్లో నెలకొల్పారు. కోఠిలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న విక్టరీ ప్లే గ్రౌండ్లో ఏకంగా 65 అడుగుల ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారు సింహ వాహనంపై మహాశక్తి అవతారంలో కనిపిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్ లానే దుర్గామాత విగ్రహాన్ని కూడా ఉన్నచోటే తయారు చేయించారు.