News June 12, 2024

ఎర్రకోటపై దాడి.. దోషికి క్షమాభిక్ష నిరాకరణ

image

ఎర్రకోటపై దాడి ఘటనలో దోషిగా తేలిన ఉగ్రవాది మహమ్మద్ అరీఫ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. 24 ఏళ్ల క్రితం ఎర్రకోటపై లష్కరే తోయిబా ఉగ్రసంస్థ చేసిన దాడిలో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. ఈ దాడిలో దోషిగా తేలిన మహ్మద్ అరీఫ్‌కు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో ఉరిశిక్ష నుంచి మినహాయింపు(క్షమాభిక్ష) ఇవ్వాలని అరీఫ్ ముర్మును ఆశ్రయించారు.

Similar News

News November 2, 2025

రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

ఏపీలోని కర్నూలు, తిరుపతి జిల్లాల్లో రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.

News November 2, 2025

ఇస్రో దేశ ప్రజలను గర్వపడేలా చేస్తోంది: మోదీ

image

అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ప్రయోగం <<18179210>>విజయవంతం<<>> కావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మన అంతరిక్ష రంగం దేశ ప్రజల్ని గర్వపడేలా చేస్తూనే ఉందని కొనియాడారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘మన సైంటిస్టుల ఘనత వల్ల అంతరిక్ష రంగం నూతన ఆవిష్కరణలకు, ప్రయోగాలకు పర్యాయపదంగా మారింది. వారి విజయాలు దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఎన్నో జీవితాలకు సాధికారత కల్పిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.

News November 2, 2025

రాజకీయ హింస.. ఏడాదిలో 281 మంది మృతి

image

విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారం కోల్పోయినప్పటికీ పొలిటికల్ వయలెన్స్ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది AUG నుంచి ఈ ఏడాది SEP వరకు అల్లర్లలో 281 మంది మరణించారని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. అలాగే అక్రమ నేరారోపణలతో 40 మంది చట్టవిరుద్ధ హత్యలకు గురయ్యారని తెలిపింది. మరో 153 మందిని దారుణంగా ఉరితీశారని పేర్కొంది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జవాబుదారీగా ఉండటం లేదని అభిప్రాయపడింది.