News June 12, 2024

ఛార్జీలు పెంచలేదు.. RTC ప్రకటన

image

TG: బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని TGSRTC ఛైర్మన్ సజ్జనార్ ప్రకటించారు. ‘హైవేలపై కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలను పెంచడంతో టికెట్‌లో టోల్ సెస్‌ను సవరించాం. ఈ నెల 3వ తేదీ నుంచి టోల్ ప్లాజాలున్న రూట్లలోనే ఇవి అమల్లోకి వచ్చాయి. సాధారణ రూట్లలో ఛార్జీల్లో మార్పు చేయలేదు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం’ అని ఆయన హెచ్చరించారు.

Similar News

News October 6, 2024

జనసంద్రమైన మెరీనా బీచ్(PHOTOS)

image

చెన్నైలో ఎయిర్‌షోకు ప్రజలు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో లక్షలాది మంది ఎయిర్‌షోను చూసేందుకు తరలివచ్చారు. దీంతో మెరీనా బీచ్ అంతా జనసంద్రమైంది. బీచ్‌కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. ఈక్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు.

News October 6, 2024

పాక్‌పై మరోసారి ఆధిపత్యం చాటిన భారత్

image

భారత మహిళల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును ఓడించింది. ఇరు జట్లు ఇప్పటివరకు మెగా టోర్నీల్లో 8 సార్లు తలపడి భారత్ 6 సార్లు గెలవగా, పాక్ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక ఓవరాల్‌గా దాయాదుల మధ్య 16 టీ20 మ్యాచులు జరగ్గా 13 భారత్, 3 పాక్ గెలిచింది.

News October 6, 2024

చెన్నైలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

image

చెన్నై మెరీనా బీచ్‌లో ఎయిర్‌షో సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. ఎయిర్‌షో చూసేందుకు లక్షలాది మంది తరలిరావడంతో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. సుమారు 100 మంది స్థానిక ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.