News June 13, 2024

ఏపీలో నేడు స్కూళ్లు రీఓపెన్

image

AP: రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం ఇవాళ్టి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. జగనన్న విద్యా కానుకను స్టూడెంట్ కిట్ పేరుతో విద్యార్థులకు టీచర్లు అందించనున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని PM-పోషణ్ గోరుముద్ద పేరుతో అమలు చేస్తారు. పాఠశాలలు నిన్నే రీఓపెన్ కావాల్సి ఉండగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో టీచర్ సంఘాల విజ్ఞప్తితో సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News December 27, 2025

ప్రాజెక్టులపై అసెంబ్లీలో PPT ప్రజెంటేషన్!

image

TG: ఈనెల 29 నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. PPT ప్రజెంటేషన్ ద్వారా దీటుగా జవాబిచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అదే తరహాలో తానూ PPTతో ప్రశ్నించడానికి BRS నేత హరీశ్ రెడీ అవుతున్నారు. ఒకవేళ తనను అందుకు అనుమతించకపోతే సభ వెలుపల PPT ప్రదర్శించాలని యోచిస్తున్నారు.

News December 27, 2025

చలి ఎక్కువగా అనిపిస్తోందా? ఇవి కూడా కారణం కావొచ్చు

image

కొందరికి చలి ఎక్కువగా అనిపించడం అనేది శరీరంలోని వివిధ సమస్యలను సూచిస్తుందంటున్నారు నిపుణులు. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా పనిచేయనప్పుడు చలి ఎక్కువగా అనిపిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేని వారు ఈ కోవకు చెందుతారు. అలాగే విటమిన్ B12, విటమిన్ D లోపం ఉన్నవారిలో కూడా చలి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వీరు పాలకూర, బీట్‌రూట్, గుడ్లు, చేపలు, చికెన్ పాలు, పెరుగు తినాలని సూచిస్తున్నారు.

News December 27, 2025

బంగ్లాదేశ్ కోసం ధర్మయుద్ధం చేశాం: ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్

image

1971లో బంగ్లాలో పాక్ సైన్యం చేసిన అరాచకాలను చూస్తూ ఉండలేకపోయిన భారత్ ‘ధర్మయుద్ధం’ చేసిందని ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ గుర్తుచేశారు. పాక్ ఎప్పుడూ అధర్మాన్నే నమ్ముకుందని.. మనం మాత్రం శత్రువులకు కూడా గౌరవం ఇచ్చామన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే కచ్చితంగా తగిన సమయంలో అది బుద్ధి చెబుతుందని పరోక్షంగా బంగ్లాను హెచ్చరించారు.