News June 13, 2024

పాడేరు ఘాట్ వ్యాన్ ప్రమాదంలో బిడ్డ కోసం తల్లి సాహసం

image

పాడేరు ఘాట్‌లో సౌండ్ సిస్టం లోడుతో వెళ్తున్న వ్యాన్ బుధవారం బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తన బిడ్డను రక్షించుకునేందుకు ఓ తల్లి సాహసం చేసింది. వ్యాన్ కింద నలిగిపోతున్న బిడ్డకు ఏమీ కాకుండా కౌగిలిలో వదలకుండా పట్టుకుంది. దీంతో వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బిడ్డకు ఏమీ కాకుండ తల్లి చేసిన సాహసాన్ని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు.

Similar News

News January 24, 2026

విశాఖలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ తాత్కాలిక మార్పు

image

విశాఖ రైల్వే రిజర్వేషన్ కార్యాలయాన్ని ఈనెల 26 మధ్యాహ్నం నుండి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. దీనిని సాధారణ టికెట్ బుకింగ్ కార్యాలయం (General Booking) వద్దకు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ నుండి రిజర్వేషన్ సేవలు అక్కడే అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.

News January 24, 2026

విశాఖ రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కార్యాలయం మార్పు

image

విశాఖ రైల్వే స్టేషన్ వద్ద రిజర్వేషన్ కౌంటర్‌ను మార్చుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జనవరి 26 నుంచి ప్రస్తుత రిజర్వేషన్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు చెప్పారు. జనవరి 27 నుంచి విశాఖ రైల్వే స్టేషన్ గేట్ నంబర్-2, నంబర్-3 మధ్యగల భవనంలో రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News January 24, 2026

విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు

image

రిపబ్లిక్ డే రద్దీ దృష్ట్యా విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. 08517 రైలు జనవరి 25న సాయంత్రం5.30కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15కి చర్లపల్లి చేరుతుంది. తిరుగుపయనంలో 08518 రైలు జనవరి 26న మధ్యాహ్నం 3.30కి చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ వస్తుంది. ఈ రైళ్లు దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా ప్రయాణిస్తాయి.