News June 13, 2024
కెప్టెన్గా రోహిత్ శర్మ మరో ఘనత

ICC ఈవెంట్లలో భారత్కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరారు. ధోనీ 58 మ్యాచ్లలో 41 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నారు. హిట్ మ్యాన్ 20 మ్యాచ్లలో 17 గెలుపులు, గంగూలీ 22 మ్యాచ్లలో 16 విజయాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రోహిత్ సారథ్యంలో WTC ఫైనల్, ODI WC ఫైనల్, T20WC సెమీ ఫైనల్లో భారత్ ఓడింది. ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Similar News
News September 14, 2025
ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి

ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచులో భారత్ ఓడిపోయింది. తొలుత భారత మహిళల జట్టు 281/7 రన్స్ చేసింది. ప్రతిక (64), స్మృతి (58), హర్లీన్ (54) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ 44.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. లిచ్ఫీల్డ్ 88 పరుగులతో జట్టును ముందుండి నడిపించారు. మూనీ 77 రన్స్తో రాణించారు.
News September 14, 2025
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్: CM

AP: తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని, ప్రతి బస్సుకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త బస్ స్టేషన్లో 150 బస్సులు ఒకేసారి నిలిపేలా బస్బే ఉండాలని, లక్ష మంది రాకపోకలు సాగించేందుకు వీలుగా దీనిని నిర్మించాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునికీకరించాలని సూచించారు.
News September 14, 2025
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక హైకమాండ్దే: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయం హైకమాండ్ చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్, మంత్రులతో సమావేశమైన రేవంత్.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆదేశించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. బూత్ల వారీగా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.