News June 13, 2024
కావలి: కొత్తరకం దొంగతనం!

సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపి బంగారు గొలుసులు, బ్యాగులను దోచుకున్న ఘటన శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలును ఆపి గుడివాడకు చెందిన వి.నిర్మల మెడలోని బంగారు గొలుసును, పద్మకు చెందిన బ్యాగును ఎత్తుకెళ్లారు. అదేవిధంగా తిరుపతి స్పెషల్ రైలులో ప్రయాణికుడు పాపారావుపై దాడి చేసి అతని భార్య మెడలోని బంగారు గొలుసును తెంపుకెళ్లారు.
Similar News
News January 15, 2026
మన నెల్లూరులో ఏమంటారంటే..?

నేడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమై పంటకోత ముగిసి ప్రకృతి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే పండగ ఇది. దీన్ని సంక్రాంతి అని, మకర సంక్రాంతి అని పొంగల్ అని మరికొందరు అంటారు. మన నెల్లూరు జిల్లాలో పెద్ద పండగ అంటారు. చనిపోయిన తల్లిదండ్రులకు తర్పణం వదులుతారు. వాళ్ల ఫొటోలు పెట్టి పూజలు చేస్తారు. ఉపవాసంతో నాన్ వెజ్ వండని పాత్రల్లో పవిత్రంగా ప్రసాదాలు చేసి సమర్పిస్తారు.
News January 15, 2026
కోవూరు : సంక్రాంతి అంటే మీకు తెలుసా..?

సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అతి పవిత్రమైన రోజు. దీనితో ఉత్తరాయన పుణ్య కాలం ప్రారంభమై పంటకోత ముగిసి ప్రకృతికి, సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. ఈ పండుగను పెద్ద పండుగ అని అంటారు. దీనిని నువ్వులు, బెల్లంతో చేసే వంటకాలతో, రంగవల్లులతో పెద్దలకు నమస్కరించి కొత్త జీవితాన్ని స్వాగత్తిస్తూ కుటుంబసమేతంగా జరుపుకుంటారు. పండుగ విశిష్టత తెలిసినవారు కామెంట్ చేయండి.
News January 15, 2026
జిల్లాలోని 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ

జిల్లాలోని 23 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్మించబడిన 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ కలగనున్నట్లు డీడీఓ గుర్రప్ప తెలిపారు. బుధవారం ఢిల్లీకి చెందిన జాతీయ గిడ్డంగుల ప్రాధికార సంస్థ సహాయక సంచాలకులు సాయి ప్రదీప్తో ఆయన భేటీ అయ్యారు. నిర్మించిన గిడ్డంగులకు అక్రిడేషన్ పనులు వేగవంతంగా పూర్తయితే రైతుల పండించిన పంటల్లో గిడ్డంగులలో భద్రపరచుకోవచ్చన్నారు.


