News June 13, 2024
మంత్రి స్థానం నిలబెట్టుకున్న ‘సాలూరు’ నియోజకవర్గం

సాలూరు నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎమ్మెలేగా గెలిచిన గుమ్మడి సంధ్యారాణి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆమె సమీప ప్రత్యర్థి మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక. రాజన్నదొరపై 13,733 ఒట్ల మోజారిటీతో గెలుపొందారు. లోకేశ్ యువగళం కార్యక్రమంలో సాలూరులో ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆమె గెలుపుతో ‘సాలూరు’ నియోజకవర్గం మంత్రి స్థానం నిలబెట్టుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Similar News
News November 5, 2025
VZM: పీజీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్

ఏయూ పీజీ పరీక్షలలో ముగ్గురు విద్యార్థులను డిబార్ చేశారు. మంగళవారం ప్రారంభమైన పీజీ పరీక్షల్లో విజయనగరం జిల్లా ఎస్.కోట చైతన్య డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు రాసిన ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కి పాల్పడుతున్నట్లు విశ్వవిద్యాలయంకి వెళ్లిన తనిఖీ బృందం గుర్తించింది. దీంతో ఈ విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని ఏ.యూ స్పష్టం చేసింది.
News November 5, 2025
పెట్టుబడులపై అవగాహన కల్పించండి: మంత్రి కొండపల్లి

విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాల అమలు, తదితర అంశాలపై అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్న తెలుగు ఎన్నారైలతో ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానం వివరించి వారికి పెట్టుబడులపై అవగాహన కల్పించాలని అన్నారు.
News November 4, 2025
VZM: ఈ నెల 6న జడ్పీ సర్వ సభ్య సమావేశం

జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరుగనుందని CEO సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అక్టోబర్ 29న నిర్వహించాల్సిన సమావేశాన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబర్ 6న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.


