News June 13, 2024
ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు?

AP: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంతోపాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఈ పదవి కోసం కొందరు TDP సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పీకర్ రేసులో కళా వెంకట్రావ్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రఘురామకృష్ణరాజు, ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.
Similar News
News September 12, 2025
ఎంటర్పెన్యూర్షిప్తోనే రాష్ట్రాభివృద్ధి: వ్యాపారవేత్తలు

AP: వ్యాపార రంగం వచ్చే పదేళ్లలో ఎలాంటి పురోగతిని చూడబోతోంది అనే అంశంపై Way2News Conclaveలో తెనాలి డబుల్ హార్స్ MD శ్యాంప్రసాద్, సోనోవిజన్ MD భాస్కర్ మూర్తి, GVమాల్ MD ఉమామహేశ్వర్, విజ్ఞాన్ విద్యా సంస్థల ఛైర్మన్ రత్తయ్య తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉద్యోగాలు కాకుండా సొంత వ్యాపారంతోనే వ్యక్తిగత, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వారు సూచించారు. ఎవరైనా టెక్నాలజీని వ్యాపారంలో భాగం చేసుకోవాలని సూచించారు.
News September 12, 2025
దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. కారణమిదే!

UP బరేలీలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఇది తమ పనేనంటూ రోహిత్ గొడారా& గోల్డీ బ్రార్ గ్యాంగ్ SMలో పోస్ట్ చేసింది. ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహరాజ్ను అగౌరవపరిచినందుకే కాల్పులు జరిపామంది. ఇది ట్రైలర్ మాత్రమేనని, సాధువులు, సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఎవర్నీ వదలబోమని హెచ్చరించింది. కాగా ఇటీవల అనిరుద్ధాచార్యపై దిశా సోదరి కుష్బూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
News September 12, 2025
‘TG 09 G9999’కు రూ.25.50 లక్షలు

TG: సెంటిమెంట్ కోసం కొందరు వాహనం కంటే రిజిస్ట్రేషన్ నంబర్కు అధికంగా వెచ్చిస్తుంటారు. HYD సెంట్రల్ జోన్ RTA ఇవాళ నిర్వహించిన వేలంలో TG09G9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ.25.50 లక్షలు పలికింది. పలు కార్పొరేట్ కంపెనీలు, సోలో బయ్యర్స్ పాల్గొనగా Hetero డ్రగ్స్ లిమిటెడ్ భారీ ధరకు ఈ నంబర్ను దక్కించుకుంది. ఇతర నంబర్లు రూ.1.01-6.25 లక్షల వరకు సేల్ అయ్యాయి. మొత్తంగా ఒక్క రోజే రూ.63.7 లక్షల ఆదాయం వచ్చింది.