News June 14, 2024
ఈవీఎంలలో ఓటర్ల మ్యాజిక్ కనిపించింది: శరద్ పవార్

వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని NCP-SP చీఫ్ శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘LS ఎన్నికల సమయంలో ప్రజలు మనసులో ఏముందో చెప్పలేదు. అయినా ఆందోళన చెందొద్దని, వారు EVMలో సరైన బటన్ నొక్కుతారని కార్యకర్తలకు చెప్పా. వాటిని తెరిచినప్పుడు ఓటర్లు చేసిన మ్యాజిక్ కనిపించింది’ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో NCP-SP 8 సీట్లు గెలుచుకుంది.
Similar News
News January 14, 2026
ఫేక్ రిఫండ్లతో ₹5 కోట్లు కొల్లగొట్టాడు

e-కామర్స్ ప్లాట్ఫాంల రిటర్న్ సిస్టమ్ లూప్హోల్స్ను ఆసరా చేసుకొని ఓ యువకుడు రిఫండ్ కింద ఏకంగా ₹5Cr కొల్లగొట్టాడు. చైనాలో లూ అనే వ్యక్తి కాస్మొటిక్ షాపింగ్ ప్లాట్ఫాంలో 11900 ఫేక్ రిఫండ్ రిక్వెస్టులు పెట్టాడు. తనకు వచ్చిన వస్తువుల్ని తిరిగి సెకండ్స్ కింద మార్కెట్లో అమ్మేవాడు. 2024లో రిఫండ్లపై అనుమానంతో ఓ కంపెనీ ఫిర్యాదు చేయగా స్కామ్ బయటపడింది. చివరకు కోర్టు అతనికి 6ఏళ్ల జైలుశిక్ష విధించింది.
News January 14, 2026
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కోహ్లీ నం.1

విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నంబర్-1 స్థానం దక్కించుకున్నారు. ఇటీవల భీకర ఫామ్లో ఉన్న అతడు ICC తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో రోహిత్ను వెనక్కి నెట్టి నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్కి చేరారు. రోహిత్ శర్మ మూడో ర్యాంకుకు పడిపోయారు. గిల్-5, శ్రేయస్-10 స్థానంలో ఉన్నారు. ఇక ఓవరాల్గా 28,068 రన్స్తో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా 34,357 పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉన్నారు.
News January 14, 2026
కొందరి పౌరసత్వ నిర్ధారణ కోసం ఎన్నికల ప్రక్రియను ఆపలేము: ECI

పౌరసత్వం తేలేవరకు ఓటు హక్కును తొలగించవచ్చా? అని ECని SC ప్రశ్నించింది. SIR వ్యాజ్యంపై CJI సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి విచారించారు. ‘పౌరసత్వంపై కేంద్రానికి నివేదించి EC నిర్ణయం తీసుకుంటుంది. అయితే కేంద్రం తేల్చే వరకు వేచి ఉండకుండా EC నిర్ణయం తీసుకోవచ్చు. ఓటరు పేరు తొలగించొచ్చు. దానిపై సదరు వ్యక్తి అప్పీలు చేయొచ్చు’ అని EC న్యాయవాది ద్వివేది కోర్టుకు తెలిపారు. దీనికోసం ఎన్నిక ప్రక్రియ ఆపలేమన్నారు.


