News June 14, 2024
పృథ్వీరాజ్పై అరెస్టు వారెంట్
AP: భార్యకు మనోవర్తి చెల్లింపు కేసులో సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను జులై 15కు వాయిదా వేసింది. నెలకు రూ.22వేల మనోవర్తితోపాటు బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పృథ్వీ పాటించలేదని భార్య శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ ఇచ్చింది.
Similar News
News October 7, 2024
ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే: ఒవైసీ
TG: హైడ్రా కూల్చివేతలపై 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూచట్టం ప్రకారమే ముందుకెళ్లాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. బాపూఘాట్తో సహా ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ సచివాలయం కూడా ఆ పరిధిలోనే ఉందని చెప్పారు. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ముందుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
News October 7, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 7, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:55 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:07 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:04 గంటలకు
అసర్: సాయంత్రం 4:21 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:00 గంటలకు
ఇష: రాత్రి 7.12 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 7, 2024
మయాంక్ యాదవ్ అరుదైన ఘనత
టీమ్ ఇండియా క్రికెటర్ మయాంక్ యాదవ్ ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన ఘనత సాధించారు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో తన తొలి ఓవర్ను మెయిడెన్గా ముగించారు. దీంతో అరంగేట్ర మ్యాచ్లోనే మెయిడెన్ వేసిన మూడో భారత బౌలర్గా రికార్డులకెక్కారు. గతంలో 2006లో సౌతాఫ్రికాపై అజిత్ అగార్కర్, 2022లో ఇంగ్లండ్పై అర్ష్దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించారు.