News June 14, 2024
MHBD: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రౌతు గూడెం తండాలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గత వారం భర్త రవి సంగెం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక భార్య సరిత గురువారం బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 5, 2024
స్వగ్రామానికి చేరుకున్న నరేశ్రెడ్డి మృతదేహం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకుడు నూకల నరేశ్ రెడ్డి మరణాన్ని అధికారికంగా ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు.ఈ నేపథ్యంలో రాత్రి ఒంటి గంటకు ఆయన స్వగ్రామం పురుషోత్తమాయగూడెంకు మృతదేహం చేరుకుంది. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు స్వగృహంలో ఉంచి అనంతరం అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని కుటుంబసభ్యులు తెలిపారు.
News October 5, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> MHBD: జిల్లాలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం
> BHPL: చిట్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ స్వల్ప గాయాలు
> MHBD: పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
> JN: ప్రైవేటు పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత
> BHPL: రేగొండలో బైకును ఢీ కొట్టిన వ్యాన్.. వ్యక్తికి గాయాలు
> MLG: లారీలతో రోడ్డుపై ప్రజల ఇబ్బందులు
> HNK: సఖి కేంద్ర సేవలపై ప్రజలకు అవగాహన సదస్సు
News October 5, 2024
చంద్రప్రభ వాహనం మీద ఊరేగుతున్న భద్రకాళి అమ్మవారు
భద్రకాళి అమ్మవారిని మకర వాహనం మీద గంగాభవానిగా, చంద్రప్రభ వాహనం మీద అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరించారు. మకర వాహనం మీద గంగాభవానిగా అమ్మవారిని దర్శించడం వల్ల జలగండాలు దూరమవుతాయని అర్చకులు తెలిపారు. చంద్రప్రభ వాహనం మీద రాజరాజేశ్వరిగా ఊరేగుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల సాధకుడు చంచలత్వాన్నివీడి మనస్సు స్థిరమై సాధనలో నిమగ్నమవుతాడని చెప్పారు.