News June 14, 2024

WOW.. వాట్సాప్‌‌లో 3 అదిరిపోయే ఫీచర్స్

image

వాట్సాప్‌ కాల్స్‌లో మరో మూడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. దీనితో ఒకేసారి 32 మంది స్నేహితులతో వీడియో కాల్‌ మాట్లాడొచ్చు. ఇప్పటి వరకూ ఉన్న స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ఇకపై ఆడియోతో అందుబాటులోకి వస్తుంది. మెరుగైన ఆడియో, వీడియో నాణ్యతను అందించేందుకు MLow కోడెక్‌ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది వాయిస్ క్లారిటీతో పాటు HDలో వీడియో కాల్ మాట్లాడే సదుపాయాన్ని అందిస్తుంది.

Similar News

News November 8, 2025

జీరో టిల్లేజీలో మొక్కజొన్న సాగు – సూచనలు

image

జీరో టిల్లేజి పద్ధతిలో వరిచేను కోశాక దుక్కి దున్నకుండానే పదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. బరువైన, తేమను నిలుపుకొనే నేలలో మాత్రమే ఈ పద్ధతిని పాటించాలి. కోస్తా జిల్లాల్లో నవంబరు నుంచి జనవరి మొదటి వారం వరకు నాటవచ్చు. వరి కోత తర్వాత నేలలో తగినంత తేమ లేకపోతే ఒక తేలికపాటి తడిచ్చి పంట విత్తుకోవాలి. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. ఉండేట్లు విత్తాలి.

News November 8, 2025

60 ఏళ్ల వృద్ధుడు ₹1800 కోట్ల స్కామ్ వెలికితీత

image

MHలో Dy.CM అజిత్ పవార్ కుమారుడు పార్థ్ కంపెనీకి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం తీవ్రవివాదంగా మారింది. ₹1800CR విలువైన భూమిని ₹300CRకే కట్టబెట్టారు. ఈ స్కామ్‌పై ముందుగా దిన్‌కర్ కోట్కర్(60) IGR ఆఫీసుకు లేఖ రాసినా స్పందన రాలేదు. ఆ లేఖను తీసుకున్న ఓ సోషల్ యాక్టివిస్టు రికార్డులు టాంపర్ చేసినట్లు బయటపెట్టారు. అధికారుల విచారణలో అక్రమాలు నిజమని తేలడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది.

News November 8, 2025

ఎడ్యుకేషనల్ హబ్‌గా కుప్పం: సీఎం చంద్రబాబు

image

AP: కుప్పంలో రూ.2,203కోట్ల పెట్టుబడితో 7 సంస్థల ఏర్పాటుకు CM చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తాం. ప్రైవేట్, రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రోత్సహిస్తాం. ఇప్పటికే యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి’ అని తెలిపారు. కుప్పంలో ల్యాప్‌టాప్, మొబైల్ యాక్సెసరీస్ వంటి 7 సంస్థలకు ప్రభుత్వం 241 ఎకరాలు కేటాయించింది.