News June 14, 2024
నల్గొండ: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతిచెందిన ఘటన అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ట్రాక్టర్ రాయిని ఢీకొట్టడంతో డ్రైవర్ లక్ష్మీనారాయణ కింద పడ్డాడు. దీంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లక్ష్మీనారాయణ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 15, 2025
పెద్దవూర: మూడు ఓట్లతో ఇండిపెండెంట్ విజయం

పెద్దవూర మండలం సంగారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇండిపెంటెండ్ ఈసం రమేష్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన మాతంగి శ్రీనయ్య మీద 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు గ్రామానికి సేవ చేస్తా అని అన్నారు.
News December 14, 2025
త్రిపురారం: రాష్ట్రంలోనే చిన్న పంచాయతీ.. ఎవరు గెలిచారంటే..

బృందావనపురం సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన మందడి రమణారెడ్డి విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన వంగాల శ్రీనివాస్ రెడ్డిపై ఏడు ఓట్ల తేడాతో రమణారెడ్డి విజయం సాధించారు. రమణారెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బృందావనపురం గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ కావడం విశేషం. ఇక్కడ కేవలం 98 ఓట్లు మాత్రమే ఉన్నాయి.
News December 14, 2025
నల్గొండ జిల్లాలో తొలి ఫలితం

నిడమనూరు మండలం వెంగన్నగూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సలాది నాగమణి నాగరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన కొండారి నాగజ్యోతి చంద్రశేఖర్ మీద 87 ఓట్ల తేడాతో వారు విజయం సాధించారు. తమ మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధికి పాటుపడతామని నాగమణి తెలిపారు.


