News June 14, 2024

అహంకారులను రాముడు 241 వద్దే ఆపాడు: RSS నేత ఇంద్రేశ్

image

తన అహంభావం వల్ల బీజేపీ 241 సీట్లకే పరిమితమైందని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ ఘాటు విమర్శ చేశారు. అందుకే రాముడు ఆ పార్టీని తక్కువ సీట్లకు పరిమితం చేశాడని పేర్కొన్నారు. ఇండియా కూటమి రాముడికి వ్యతిరేకమని ఆరోపించారు. అందుకే వారు కూడా 234 సీట్లతో సరిపెట్టుకున్నట్లు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇంద్రేశ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Similar News

News February 1, 2025

దారుణం.. తల్లి మృతదేహంతో తొమ్మిది రోజులు!

image

TG: తల్లి మృతదేహం పక్కనే డిప్రెషన్‌తో ఇద్దరు కూతుళ్లు 9రోజులు గడిపారు. HYDలోని బౌద్ధనగర్‌కు చెందిన రాజు, లలిత(45)కు రవళిక, అశ్విత ఇద్దరు కుమార్తెలు. 4ఏళ్ల క్రితం వీరిని వదిలేసి రాజు ఎక్కడికో వెళ్లాడు. ఈ క్రమంలో లలిత గుండెపోటుతో మరణించారు. అంతిమ సంస్కారాలకు డబ్బులు లేక కూతుళ్లు కూడా చనిపోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో నిన్న బాహ్య ప్రపంచానికి తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

News February 1, 2025

Stock Markets: బడ్జెట్‌కు ముందు మార్కెట్లు అప్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 25,555 (+50), సెన్సెక్స్ 77,695 (+210) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఐటీసీ హోటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, బీఈఎల్, అల్ట్రాటెక్ సెమ్ టాప్ గెయినర్స్. హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, గ్రాసిమ్, ట్రెండ్ టాప్ లూజర్స్.

News February 1, 2025

బంగారం @ All Time High

image

బంగారం భగభగమంటోంది. మునుపెన్నడూ చూడని విధంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తొలిసారి ఔన్స్ విలువ $2817 వద్ద All Time Highని టచ్ చేసింది. ప్రస్తుతం $2797 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, US ఫెడ్ వడ్డీరేట్లు యథాతథంగా ఉంచడం, డీడాలరైజేషన్, ట్రంప్ టారిఫ్స్‌తో ట్రేడ్‌వార్స్ ఆందోళనే ఇందుకు కారణాలని విశ్లేషకులు చెప్తున్నారు. భారత్‌లో 24K గోల్డ్ 10 గ్రాముల ధర రూ.84,340 వద్ద కొనసాగుతోంది.