News June 14, 2024
లోకేశ్ చేతిలో టెక్నాలజీ రంగం

AP: మంత్రి నారా లోకేశ్కు మానవ వనరులు, ఐటీ, RTG శాఖను కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఆయన ఐటీ శాఖనే తీసుకుని సమర్థంగా పని చేశారు. మంగళగిరి కేంద్రంగా ఐటీ అనుబంధ సంస్థలు, యువతకు నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. HCL వంటి దిగ్గజ IT సంస్థను APకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే చంద్రబాబు మానస పుత్రికగా భావించే రియల్ టైమ్ గవర్నెన్స్ బాధ్యతలను సైతం లోకేశ్కు అప్పగించారు.
Similar News
News September 18, 2025
వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐటీ షేర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 83,013 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి చెంది 25,423 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు కూడా భారీగా లాభాలు ఆర్జించాయి.
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<