News June 14, 2024

జగన్ మళ్లీ ఫేక్ ప్రచారం మొదలెట్టాడు: మంత్రి అచ్చెన్న

image

చంద్రబాబు మంత్రివర్గంలో సొంత సామాజికవర్గానికి చెందిన 15 మందికి అవకాశం కల్పించారని కొన్ని ఛానళ్లలో వస్తున్న కథనాలు పూర్తిగా ఫేక్ అని మంత్రి అచ్చెన్న ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలు వైసీపీని 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసినా జగన్‌కు సిగ్గు రాలేదని ట్విటర్(X) వేదికగా ఫైరయ్యారు. 15 మంది కమ్మ కులానికి చెందిన మంత్రులంటూ మళ్లీ ఫేక్ ప్రచారం మొదలెట్టారంటూ దుయ్యబట్టారు.

Similar News

News October 2, 2024

సికింద్రాబాద్- శ్రీకాకుళానికి ప్రత్యేక రైలు

image

దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 07487 నంబర్ గల ట్రైన్ సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు మధ్య ఆరు ట్రిప్పులు తిరుగుతుందని తెలిపారు. ఈ రైలు అక్టోబర్ 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. ఈ మేరకు ప్రయాణికులు విషయాన్ని గమనించాలని అన్నవరం, విజయనగరం మధ్య రాకపోకలు సాగిస్తుందని రైల్వే అధికారులు సూచించారు.

News October 2, 2024

స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్యం : రామ్మోహన్ నాయుడు

image

స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ముందుకు సాగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం నగరంలో సైకిల్ తొక్కుతూ అవగాహన కల్పించారు.

News October 2, 2024

శ్రీకాకుళం: గిల్టు నగలకు రూ.16 లక్షల రుణం

image

శ్రీకాకుళంలోని ఓ బ్యాంకులో అప్రైజర్‌ అవినీతి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు..గిల్ట్ నగలు తన బంధువుల పేర్ల మీద తాకట్టు పెట్టి రూ.16 లక్షల రుణం తీసుకున్నారు. గుర్తించిన అధికారులు రూ.1.50 లక్షలు రికవరీ చేయగా..మిగిలింది కట్టకుండా కాలయాపన చేస్తుండడంతో సిబ్బంది అతనిపై ఫిర్యాదు చేయాలనుకున్నారు. మంగళవారం పోలీసులను ఆశ్రయించగా పూర్తి వివరాలు లేవని ఫిర్యాదు తీసుకోలేదని ఎచ్చెర్ల సీఐ తెలిపారు.