News June 14, 2024

ఆగస్టు 1 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్

image

AP: ఆగస్టు 1 నుంచి గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు వైద్యశాఖ కమిషనర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఇందుకోసం 20వేల మందికి క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి టెస్టుల కోసం వైద్య కళాశాలలు, సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ హోమీబాబా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి WHO భాగస్వామ్యంతో టెస్టులు చేస్తారు.

Similar News

News September 13, 2025

ALERT: ITR ఫైల్ చేయడం లేదా?

image

2024-25FYకి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ITR) ఫైల్ చేయడానికి మరో 2 రోజులే గడువు ఉంది. కేంద్రం రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇచ్చిందని చాలామంది ఫైల్ చేయడం లేదు. కానీ ఈ నిర్ణయం 2025-26 నుంచి అమల్లోకి రానుంది. 2024-25లో ఆదాయం రూ.3 లక్షలు దాటినవారు కూడా ఇప్పుడు ITR ఫైల్ చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. SEP 15 డెడ్‌లైన్ దాటితే రూ.5వేల వరకు పెనాల్టీ పడుతుందని హెచ్చరిస్తున్నారు.

News September 13, 2025

రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దు: పవన్ కళ్యాణ్

image

AP: తనపై దుష్ప్రచారం చేసేవారిని ప్రజాస్వామ్యయుతంగా, చట్టప్రకారమే తిప్పికొట్టాలని జనసైనికులకు Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. ఘర్షణ పడడం ద్వారా సమస్య మరింత జటిలమవుతుందని పేర్కొన్నారు. ‘పదేళ్లుగా మనపై కుట్రలు చేస్తున్నవారిని చూస్తూనే ఉన్నాం. అలాంటివారి ఉచ్చులో పడొద్దు. ఎవరూ ఆవేశానికి గురై గొడవలకు దిగవద్దు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించేవారిని చట్టం ముందు నిలబెట్టాలి’ అంటూ దిశానిర్దేశం చేశారు.

News September 13, 2025

రాజధానిపై సజ్జల కామెంట్స్ వైరల్.. మీరేమంటారు?

image

AP: తాము గెలిస్తే గుంటూరు-విజయవాడ మధ్య <<17688305>>రాజధాని<<>> ఏర్పాటు చేస్తామన్న సజ్జల వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్నిసార్లు మాట మారుస్తారని TDP శ్రేణులు విమర్శిస్తున్నాయి. 2014లో జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించారని, 2019లో గెలిచాక 3 రాజధానులు అన్నారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ మాట మార్చారని, ఇది దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. మరి రాజధానిపై సజ్జల వ్యాఖ్యలపై మీ కామెంట్?