News June 15, 2024

తూ.గో.: తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నంబరు మార్పు

image

విశాఖపట్నం నుంచి కడప వయా తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి మీదుగా వెళ్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్‌ను రైల్వే అధికారులు మార్పు చేశారు. ప్రస్తుతం 17487/ 17488 నంబర్లపై రైలు నడుస్తుండగా, జూలై నెల 1వ తేదీ నుంచి 18521/ 18532 నంబర్లగా రైల్వే అధికారులు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పును రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు. ☛  SHARE IT

Similar News

News November 6, 2025

ధాన్యం సేకరణ సందేహాలపై కంట్రోల్ రూమ్: కలెక్టర్

image

ఖరీఫ్‌ సీజన్‌లో వరి సేకరణ 4 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా ఇప్పటి వరకు రైతుల నుంచి మొత్తం15.64 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు సంయుక్త కలెక్టర్ వై. మేఘ స్వరూప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలుపై సందేహాలకు, ఫిర్యాదులకు కలెక్టర్ కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్ నంబర్ 83094 87151కు సంప్రదించవచ్చన్నారు.

News November 6, 2025

రాజమండ్రి: ఈనెల 7 జాబ్ మేళా

image

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఈనెల 7 శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేళాలో బీఓబీ, ఎస్‌బీఐ పేమెంట్స్, భరత్ పే వంటి పలు సంస్థలలోని ఖాళీలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ పూర్తిచేసిన, 19 నుంచి 30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

News November 5, 2025

రాజమండ్రి: పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు ఆహ్వానం

image

జిల్లాలో పర్యాటక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పి. వెంకట చలం బుధవారం ప్రకటించారు. జలక్రీడలు, సాహస క్రీడలు, లగ్జరీ హౌస్ బోట్లు, పార్టీ బోట్ల వంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి గల వారు www.tourism.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చని, లేదా 9505011951 / 6309942025 నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.