News June 15, 2024
HYD: లులు మాల్కు తాఖీదులు

అక్రమ మురుగు కనెక్షన్లపై జలమండలి దృష్టి సారించింది. KPHBలో తనిఖీలు ముమ్మరం చేసి లులు మాల్కు కనెక్షన్ లేదని గుర్తించి నోటీసులు జారీ చేశారు. లులు మాల్కు ముందు మంజీరామాల్-మంజీరా మెజిస్టిక్ హోమ్స్కు కలిపి ఒకటే ఏస్టీపీ ఉండేది. వేరుగా కనెక్షన్ తీసుకోవాలని మంజీరామాల్కు గతంలో జలమండలి అధికారులు తాఖీదులు ఇచ్చారు. ఇలా ఒకే కనెక్షన్తో ఏళ్లుగా జలమండలి రెవెన్యూ తగ్గిందని మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Similar News
News September 18, 2025
BREAKING: మైసమ్మగూడ చెరువులో తండ్రి, కూతురు మృతి

మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పేట్బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మృతులు బహదూర్పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్ (50), కూతురు దివ్య(5)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
HYD: బతుకమ్మ, దసరా కోసం ప్రత్యేక బస్సులు

బతుకమ్మ, దసరాకు ప్రయాణికుల కోసం TGSRTC 7,754 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. MGBS, JBS, CBS, KPHB, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది.
News September 18, 2025
HYD: క్షీణించిన అశోక్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులుగా చేస్తుండగా ఆరోగ్యంగా క్షీణించింది. దీంతో ఆయనను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లుగా బృందాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు.